పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

317



సంపూర్ణముగా మెచ్చుకొన్న మనుష్యుఁ డితఁ డొక్కఁడే" గోపాలరావుగారిమీఁద నున్న గౌరవముతో సమానముగ రంగనాధం మొదలియారుగారిమీద నతనికి గౌరవముండెను.

ముత్తుస్వామి అయ్యరు సంఘస్కారమున కేవిధమయిన నుపకారముఁ జేయలేదని పలుమారాతని నెన్నుచుందురు. సంఘసంస్కరణము గావలయునని యతఁ డభిప్రాయపడెనఁటగాని మెల్లగను జాగరూకతతోను జేయవలెనని యాయనమతము. మనవిద్యాధికుల నేకులు వీరివిధముననే సంస్కరణము కావలెనని మాటలఁ జెప్పుచు నాచరణమున వెనుక దీయుచుందురు. మనదేశ స్త్రీల స్థితి యుండవలసిన విధముగా లేదనియు నెంతో మార్పు జెందవలయుననియు నాతఁడభిప్రాయపడి పురుషులు తమతమ సంరక్షణమందున్న స్త్రీలకు విద్య నేర్పుచుండవలసినదని యుపదేశము చేసెను. ఆయన విదేశ ప్రయాణమునకు విరోధికాఁడు ఆవిషయమున నతఁడొకసారి "మీలో యూరపుఖండమునకు వెళ్ళగలసామర్థ్యము గలవారు తప్పక యక్కడకుఁ బోయి యచటి సంఘస్థితులు నాగరికతలుఁ దెలిసికొని జ్ఞానాభివృద్ధి జేసుకొనుఁడు".

బాల్యవివాహము కూడదని యతఁ డీక్రిందివిధమున జెప్పెను. "రజస్వలానంతర వివాహము కన్య కశాస్త్రీయముకాదు. అయినను సంఘమట్టిపని మహాపాతకమని ఊహించి తండ్రి యొక వేళ అట్టివివాహము చేసినయెడల కూఁతును బాధించును" స్త్రీపునర్వివాహ విషయమున నాయన యభిప్రాయమిది. 'స్త్రీ' యొక్క వివాహమునకే యర్హు రాలయ్యున్నను పురుషుఁడు బహుభార్యలు జీవించియున్నప్పుడు సయితము తనయిచ్చవచ్చినట్లు వివాహమాడవచ్చునట. స్త్రీ పురుషుల స్వాతంత్ర్యములలోఁ గనఁబడుచున్న యీయన సమత్వము మన కుటుంబబద్ధతులవల్ల మఱింత బాధకరముగా నున్నది. స్థితిగతు