పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

మహాపురుషుల జీవితములు



ములు వానిని సవరించుకొనవలసిన విధములు' అతడు వ్రాసిన వ్యాసమును బరీక్షించిన వారిలో నప్పుడు హైకోర్టు జడ్జీగా నుండిన హాలోవేగా రొకరు. ఆయన ముత్తుస్వామి వ్రాసిన యావ్యాసమును మిక్కిలి మెచ్చెను. బహుమాన ధనమగు నైదువందల రూపాయల ధన మొత్తము ముత్తుస్వామి కిచ్చునప్పుడు పవెలుగా రీక్రిందివిధమున బలికిరి. "ఈ రూపాయలు నీవు ముందు ముం దదృష్టవంతుఁడవై సంపాదించు ధనరాసులను విత్తనములై యుండుగాక" ముత్తుస్వామి యారూపాయలను మిక్కిలి జాగ్రత్తగాదాఁచి మృతునొందువఱకు నెన్నడు నందులో నొకరూపాయియైన దీసి వాడుకొనలేదు. అప్పుడు దొరతనమువారు ముత్తుస్వామిపేరు గెజటులో బ్రకటించి యతఁడేయుద్యోగమునకైనఁ దగినవాఁడని వ్రాసిరి. శిష్యుని వై దుష్యముఁ జక్కగ నెఱింగి పవెలుగారు వాని నింగ్లాండు పోయి సివిలు సర్వీసు పరీక్షకు జదువుకొమ్మని పురికొల్పిరి. అందఱు విద్యార్థులవలెనే ముత్తుస్వామియు నప్పటికి వివాహమాడి కాలిసంకెళ్ళు తగిలించు కొన్నందున సముద్రయానమువలన వర్ణ భ్రష్టత గలుగునను భయమునను దేశమువిడిచి బోవడయ్యె. అందుచేత విద్య ముగిసినతోడనే ముత్తుస్వామి యఱువదిరూపాయల జీతముఁమీద నుపాధ్యాయుఁ డయ్యెను. అందులోనుండగా మాంటుగొమనీగారు తంజావూరు కలక్టరు కచేరీలో వానికి రికార్డుకీపరుపని యిచ్చిరి. అందులోనుండగా నప్పటివిధ్యాధికారి (డైరక్టరు) యగు నర్బతునాటుగారు వానిని డిప్యూటి యినస్పెక్టరు (పాఠశాల పరీక్షకుఁడు) గా నియమించిరి. ఈయుద్యోగమున నెలకు నూటయేఁబదిరూపాయలు జీతము కాని ముత్తుస్వామి యయ్యరు చిరకాల మందుండలేదు. ఏలయన నాకాలమున గవర్నమెంటువారు ప్లీడరుపరీక్షం గ్రొత్తగ బెట్టిరి. అందుఁ గృతార్థులైనవారు చెన్న పట్టణపు సాదరుకోర్టులో తక్కిపయన్ని