పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

మహాపురుషుల జీవితములు



లేదు. చిత్తరువులను వ్రాయించుట వ్రాసిన వానిని దెప్పించి తన మందిరమున నుంచుకొనుట వానికి మిక్కిలి యిష్టము. మతసంబంధములగు వ్యాసంగములలో గాలము విస్తారము గడపుట వాని కిష్టములేదు. మనుష్యులు సత్ప్రవర్తన గలిగియుండి సుందరమయిన యీ ప్రపంచమందు భగవంతుడిచ్చిన పదార్థములజూచి యానందించిన చాలునని వాని యభిప్రాయము. జ్యోతిశ్శాస్త్రమందు మాధవరావు జాలకృషిచేసి సిద్ధాంత భాగ మొకటే నమ్మదగినది కాని జాతకముహూర్త భాగములు నమ్మదగినవి కావని యభిప్రాయపడి తన యభిప్రాయమును లోకమునకు వెల్లడించెను. రాజా సర్ మాధవరావు భరతఖండమాత కన్న పుత్రరత్నములలో నమూల్య మణి యని చెప్పవచ్చును.