పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా సర్ మాధవరావు

295



ప్రబలిన తావులఁ రాజరికము నెలకొలిపెను. బందిపోటు దొంగలబారినుండి తప్పించి ప్రజల ధనప్రాణముల రక్షించెను. మట్టిగుడిసెలతో నిండిన పట్టణమున సుందర మందిరములు గట్టించి రాజధానియను పేరునకుం దగినట్లుజేసెను. కాలువలఁ ద్రవ్వించెను. వంతెనలు కట్టించెను. బావులు వేయించెను. దుర్గమ ప్రదేశములకు బయనము సులభముచేసెను. వట్టినేలల పంట భూములు చేసెను. కాఫీతోటలు మొదలగు నూతన వ్యవసాయములపై జనుల కభిరుచి కలిగించెను. వేయేల ! దేశమంతయు పాడిపంటలు సిరిసంపదలు గలిగి కనుల పండువై యుండెను. మాధవరావు మంత్రిపదముం బూనుకాలమున నింగ్లీషువారు సంస్థానము గలుపుకొందురని క్షణ క్షణము భయము కలుగజొచ్చెను. అట్టి సంస్థానము మాధవరావు విడుచునప్పుడు స్వదేశ సంస్థానములలో నగ్రగణ్యమని చెప్పదగి యున్నది. మహారాజు మాధవరావునకు నెలకు వేయిరూపాయి లుపకార వేతనము నేర్పరచెను. ఆ భరణము గ్రహించుచు మాధవరావు చెన్నపట్టణమున గాఁపురముండి జీవితకాల శేషము గడపఁదలఁచెను. అట్లు చెన్నపట్టణముననున్న కాలమున గవర్నరు జనరలుగారు తన యాలోచన సభలో మాధవరావు నొక సభ్యుఁడుగా నుండుమని కోరిరి. కాని మాధవరావుగారు సభ్యత్వ మక్కర లేదనిరి. మాధవరావు తిరువాన్కూరులో నుద్యోగము మానిన వార్త యింగ్లాండులోఁ దెలిసినప్పుడు హెన్నిఫాసెట్టను నతఁడు తిరువాన్కూరు సంస్థానమంత ప్రజ్ఞతోఁ బరిపాలించిన మంత్రి యుద్యోగములేక యుండవలసి వచ్చెనా ! ఇంగ్లీషువారు తమ రాజ్యములో నాయన కేదయిన యుద్యోగ మీయఁగూడదా యని యిండియా సెక్రటరి నడిగెను.

ఆ దినములలోనే 'కలకత్తారివ్యూ' యను పత్రికలో మాధవరావును గూర్చి యాతని ప్రియశిష్యుఁడగు రామవర్మ యొకవ్యాసము