పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

మహాపురుషుల జీవితములు



మొదలగుపనులకే యలవడెనుగాని రాజ్యవ్యాపారములమీఁద దృష్టి నిలుపుట కలవడలేదు. సంస్థానమందలి యుద్యోగస్థుల జీతములు స్వల్పమగుట చేతను స్వల్పజీతములైన సరిగా నియ్యక యాఱు నెలల కొకసారి యేఁడాది కొకసారి యిచ్చుట చేతను వారు లంచగొండులై ప్రజలను బీడింపఁ జొచ్చిరి. ఖజానాకొట్లు వట్టివయ్యెను. ఇంగ్లీషువారికి రాజు కప్పము చెల్లింప లేకపోయెను. మార్గములు సరిగ లేక పోవుటచే వాణిజ్యమడుగంటెను. దేశస్థుల వృద్ధి దిగజారెను. ఆకాలమునందు హిందూ దేశమునకు డల్ హోసీప్రభువు గవర్నరుజనరలుగా నుండెను. స్వదేశరాజులను సింహాసనభ్రష్ఠులఁజేసి వారి రాజ్యముల గలుపుకొనుటలో నీ ప్రభువునకుంగల ప్రజ్ఞ యింతింత యనరాదు. మనదేశములో స్వదేశ సంస్థానమన్న పేరులేకుండఁ జేయవలయునని యీయన తలంపు. ఏ సంస్థానమందైన గొంచెము గడబిడ యల్లరి జరుగునేని యావంకబెట్టి సంస్థాన మక్రమముగఁ బరిపాలింపఁ బడుచున్నదని ప్రజలు బాధలు పడుచున్నారని వారి యిడుమ లార్చువాఁడు తీర్చువాఁడుబోలె నాయన యాసంస్థానముం గలుపుకొనుచు వచ్చెను. వారసులు లేనివారికి దొరతనమువారే వారసులని బిడ్డలు లేక మృతినొందిన మహారాజుల సంస్థానము లన్నియునీతం డింగ్లీషు వారికే జేర్చెను. ఆయన దృష్టి యాకాలమున తిరువాన్కూరు సంస్థానముపైఁ బడెను. క్రమ పరిపాలనము లేదను నెపమున దాని నతఁడు కలుపుకొనఁదలఁచి చెన్నపట్టణపు దొరతనమువారితో నాలోచించుటకు నీలగిరికిఁ బోయెను. అప్పుడు మహారాజు మేలుకొని మాధవరావును మంత్రిగాఁ దీసికొనెను. మాధవరావు తన కేఁడు సంవత్సరములు గడువిచ్చిన పక్షమున సంస్థానము మంచిస్థితిలోనికి వచ్చునని దొరతనమువారికి వ్రాసెను. ఎట్టెటో వారు దాని కంగీకరించిరి. 1857 వ సంవత్సరమున మాధవరావు తిరువాన్కూరు మంత్రి