పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

మహాపురుషుల జీవితములు



నంపిరి. ఈయన దేశాభిమానులలో ప్రథమగణ్యుఁడని చెప్పవచ్చును. సాధారణముగ దేశోపకారము జేయబూనువారు ప్రజలమెప్పుకొఱకు దొరతనము వారిచ్చుబిరుదుతోకలకొఱకు నెదురుచూతురు. ఈ శెట్టిగారు సంపాదించిన ధనమంతయు లోకహితముకొఱకు వ్యయము చేసి దొరల కోపమునకు బాత్రుఁడై ప్రజాపక్షము బూని పాటుపడి కడకు నిరుపేదయై చచ్చెను. దొరతనమువారి లోపములను మొగమోటములేక ఖండించి చెప్పుట కీదినములలో సయితము గొప్ప విద్యావంతులు ధనవంతులు భయపడుచుండ నేబది యఱువది యేండ్లక్రిందట నింగ్లీషువిస్తారము రానివాడు గొప్పపరీక్షల గృతార్థుడు కానివాడు దొరతనమువారితో బ్రతికక్షబూని నిర్వహించుటయెంత కష్టమోయోచింపుడు. మొదటవానిమంచితన మెఱుగక దొరలు వాని నేవగించుకొన్నను నిజము నిలుకడమీద తెలిసికొని త్రాచుబామను కొన్నది పూలదండయయ్యెనని తలంచి దూషించినవారె భూషించిరి. అతఁడు నిజమైన లోకోపకారబుద్ధిగలవా డగుటచే స్తోత్రములకుబ్బక నిందలకు వెఱువక తాను మంచిదని నమ్మినపని చేసెను. ఈతఁడు రాజకీయ వ్యవహారములయందెగాక సంఘసంస్కరణము నందు నిష్టముగలవాఁడె. వితంతువివాహములు మంచివని యీయన యభిప్రాయము. స్త్రీవిద్యాభివృద్ధికి స్వధనముతో గొన్ని పాఠశాలలు పెట్టించెను. అరవపండితులకుఁ దెనుఁగు పండితులకుఁ జాల సహాయము చేసెను. వేయేల లక్ష్మీనర్సుశెట్టియే లోకోపకారి. అతడే ధన్యుఁడు.