పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాజుల లక్ష్మీనర్సు శెట్టి

253



పినమహజర్ల వల్ల నతని పేరింగ్లాండులోనిదివఱకే పార్లమెంటుసభికులకు బరిచితమైనందున సేమరుదొరగారు నావదిగినతోడనే లక్ష్మీనర్సుశెట్టి బాగున్న వాడాయని యడిగెను. శెట్టియు వానిదర్శనముచేయ వారిరువురకు నొండొరులపై గౌరవమునను రాగము జనియించెను. శెట్టి దొరగారిని దనయింట గొంతకాలము విడియించి సమయము దొరికినప్పుడెల్ల గవర్నమెంటువారు మతవిషయములలోను రాజకీయ విషయముల లోను జనులకు చేయుచుండిన యపకారమును మనస్సుకు నాటునట్లు చెప్పుచువచ్చెను. సేమరుదొరగారు శెట్టిని వెంటబెట్టుకొని కడలూరు కుంభకోణము కోయంబత్తూరు మొదలగు దక్షిణ హిందూస్థానములోని ముఖ్యపట్టణములకు బోయి సర్కారుకట్టిన దుర్భరములగు పన్ను లిచ్చుకొనలేక రయితులు పడియెడు బాధలను స్వయముగా జూచెను. అతడు కొన్ని పట్టణములలో పన్ను లిచ్చుకొనలేని రయితులీక్రింద చెప్పబడిన విధమున దారుణ బాధల పడుచుండ జూచెను. కొందరు రయితులు మట్టమధ్యాహ్నపు టెండలో నడుములు వంచుకొని నిలిచియుండిరి. వారి వీపులమీద సర్కారు నౌకర్లు పెద్దరాళ్లెత్తిరి. కొందఱి కాళ్ళకు బొండవేసిరి. కొందఱిని మెడకుం గాలిగి నంటకట్టి చెట్లకో స్తంభములకో వ్రేల దీసిరి. ఆ బాధలు పడలేక యారయితులు గోలుగోలుమని యేడ్చు చుండిరి. ఇది యంతయు తాలూకా కచ్చేరీ యెదుటనే జరుగుచున్నను మేజస్ట్రీటుగారు తహస్సీలుదారుగారు వారివంక కన్నెత్తి యైన జూడక వారి మొరలు వినిపించుకొనక సుఖముగా సంతోషముగా బని చూచుచుండిరి. సేమరుదొరగారు బ్రిటిషు గవర్నమెంటు వారు పన్ను వసూలు చేయుటకు రహితులను బెట్టుచున్న యా దారుణ బాధలను గన్నులారచూచి జ్ఞాపకార్థ మొక పుస్తకములో వ్రాసికొని యాదారుణ కృత్యములలో నుపయోగింపబడు పనిముట్లు