పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

మహాపురుషుల జీవితములు



నేను చెప్పునది మనదేశస్థులు నమ్మనియడల పరమమూర్ఖులని మీరనుకొనవలసినదే. పుట్టుగ్రుడ్డిసూర్య తేజస్సునుగాని, మనోహరమైన చంద్రప్రకాశమునుగాని మన మెన్ని విధముల చెప్పినను భావింపఁ గలఁడా?"

అహమ్మదుఖాను తన కుమారుడైన సయ్యదు మహమ్మదును విద్యాభ్యాసము నిమిత్తము కేంబ్రిడ్జిపట్టణములో దిగవిడిచి 1870 వ సంవత్సరమున హిందూ దేశమునకు మరలివచ్చెను. ఆబాలుఁడగు సయ్యదు మహమ్మదు తరువాత నలహబాదు హైకోర్టులో జడ్జీ యయ్యెను. అహమ్మదుఖాను సీమనుండి వచ్చిన పిదప గాశీపట్టణములో జడ్జియయ్యెను. ఇంగ్లండునకుఁబోయి వారి యాచారముల జూచుటచేత నతఁడు సంఘసంస్కర్తయై మహమ్మదీయులలోనున్న మూఢవిశ్వాసములు దురాచారములు తొలగించుటకు మహమ్మదీయ సంఘసంస్కర్తయను పేర నొకపత్రికను బ్రకటింపఁజొచ్చెను. నిష్పక్షపాతముగ నిర్దాక్షిణ్యముగ దురాచారములను ఖండించుటచేఁ బూర్వాచారపరాయణులగు మహమ్మదీయులు వారిని ద్వేషించినను బత్రిక ప్రకటింపఁబడిన తొమ్మిది సంవత్సరములలో సంఘస్థుల యభిప్రాయములు చాల మారెను. తురకలు రాజద్రోహులని యెవరైన నన్నప్పు డహమ్మదుఖాను వారి వాదమును కఠినముగ ఖండించు చుండువాఁడు. 1872 వ సంవత్సరము సర్ విలియము హంటరుదొరగారు హిందూదేశపు మహమ్మదీయులనుపేర నొక చిన్న గ్రంథ మింగ్లీషులో వ్రాసి మహమ్మదీయులకు రాజభక్తిగలదాయని యందుసందేహముఁ గనఁబరచిరి. అహమ్మదుఖానా గ్రంథముజదవి మహమ్మదీయులయం దట్టిలోపము లేదని తెలుపుచు దానికుత్తరముగ మఱియొక పుస్తకము వ్రాసెను.

ఇంగ్లాండునుండి వచ్చినదిమొదలు సయ్యదమహ్మదుఖాను మహమ్మదీయుల యుపయోగము నిమిత్తము కేంబ్రిడ్జిలోనున్న కాలే