పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవాబ్ సర్ సలార్ జంగు

227



గ్రమత లేని స్థలముల గ్రమత నిలుపుటకు యావచ్ఛక్తినివియోగించి పనిచేసెను.

అతడన్నట్లెచేసెను. ఆకాలమున హైదరాబాదు సంస్థాన మెంత యధమస్థితిలోనుండవలెనో యంతయథమస్థితిలోనుండెను. ఖజానాలో ధనమాలేదు. నేలపన్ను వసూలు చేయుపద్ధతి మిక్కిలిపాడుగనుండెను. బేరారు రాచూరు మాలదుర్గము మొదలగుజిల్లా లప్పటికి గొన్ని దినముల క్రిందటనే పాతబాకీక్రింద నింగ్లీషు వారి కీయఁ బడెను. ఈ జిల్లాలలోనున్న జాగీరుదారులు వారి వారి జాగీరుల నింగ్లీషువారికి లోబరచవలసినదని యాజ్ఞాపింపఁబడియు దానికొప్పుకొనక తమకుఁ గలిగిన నష్టములకు నిజాముగారిమీదఁ వ్యాజ్యముల వేయదలంచిరి. నిజాముగారి బంధువులజీతముల నిచ్చుటకుఁ గావలసినసొమ్ము వచ్చుట కాధార మేదియు గానఁబడదయ్యె. నిజాముగారి సొంతనగలు సీమలో తాకట్టుపెట్టబడెను. మొత్తముమీఁద హైదరాబాదు రాజ్యముమీఁద నప్పటికున్న ఋణము మూడుకోట్లు. మహాంధకారపుంజమువలెనున్న యాసంస్థానమును బ్రకాశమానముగజేయ సలారుజంగు పూనుకొని మొగమోటము భయము నన్నవి విడిచి వినినవారందరు మహాద్భుతము నొందునట్లు వ్యవహారము నడిపెను. ఇరువదియవయేట మంత్రియై యంతపని నెవ్వఁడు నిదివఱకు చేసియుండలేదు. అతఁడు చేసిన మొట్టమొదటి మార్పే మన సంస్థానములో మిగుల బలవంతులై యెవరిలక్ష్యము లేని యరబ్బులను లొంగదీయుట. వారిజీతములక్రింద నేఁటేఁట విశేషధన మగుచుండును. వారిచేయుపని రవంతయు లేదు. అందుచే నతఁడు వారికొలు వక్కరలేదని తీసివేసెను. అంత తోఁబోక సలారుజంగు తాలూకాలలోను జాగీరులలోను గొలువుండిన యరబ్బులను రోహిలాలను పఠానులను దీసివేయవలసినదని తాలూకాదారులకు జాగీరుదారులకు నుత్తరువులు వ్రాసెను. అట్లు