పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[3]

ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

17



దెను. పూర్వాచార పక్షమునకు దేశమునందంతట ననేకసభలు జరిగెను, వాదప్రతివాదములు ప్రచురింపబడెను. వంగదేశమునం దంతట వ్యాకరణ శాస్త్రమున నసమానుఁడని పేరుబడిన యొక మహాపండితుఁడు విధవావివేకమును ఖండించుచు నొక గ్రంథమును సంస్కృతమున వ్రాసెను. ఆగ్రంథము జనులకు దెలియని దేశ భాషలలో నుండుటచేత కవులా గ్రంథమును జదువలేక స్వభాషలో రచింపఁబడిన విద్యాసాగరుని పుస్తకమును జదివి దాని సత్యమును గ్రహించిరి. ఈశ్వర చంద్రుని ప్రోత్సాహముచేత దొరతనమువారు స్త్రీ పునర్వివాహములు చేసికొన్న వారికి పిత్రార్జితమగు నాస్తిలో భాగములు పోవని శాసించుచు 1856 వ సంవత్సరమున నొక చట్టమును నిర్మించిరి. అది మొదలు తద్విషయమున బాటుపడి యామహాత్ముఁడు 1865 వ సంవత్సరము డిశంబరు 7 వ తారీఖున కలకత్తాలోఁ దనయింటిలో మొదటి స్త్రీ పునర్వివాహము జేసెను. అది యకార్యమని యతనికి దేశస్థులు తూలనాడిరి. కులస్థులు బహిష్కరించిరి. ఆప్తబాంథవు లావలకుం దొలంగిరి. ప్రాణమిత్రులు బరిత్యజించిరి. ఎల్ల కాలము నతని ప్రక్కను నిలిచి పనిచేయుదమని వాగ్దానములు చేసిన పెద్ద మనుష్యులు మొగముల చాటువేసిరి. ఇట్లు దేశస్థులచే విడువఁ బడియు విద్యాసాగరుఁడు తన కావించిన కార్యంబు శాస్త్రసమ్మత మనియుఁ జగద్ధితకరమనియు నీతిప్రవర్ధకమనియు నమ్మి యించుక యేనియు చలింపక ధైర్యసారము గలిగి పర్వతమువలె చెక్కు చెదరక నిలిచి వివాహము వెంబడిని వివాహముఁ జేయనారంభించెను. ఈ పెండిండ్లు వైభవముతోఁ జేయుటం జేసి యిత డప్పులపాలయ్యెను. ఆసమయమున ధనికులగుమిత్రులనేకులు వచ్చి ద్రవ్యసహాయము చేసి యాదుకొనుటకురాఁగా విద్యాసాగరుఁడు వారివలన నించు కేనియు సహాయముఁ గొనగ యాభారము తానే వహించెను. ఇతరులకు ధర్మోపన్యాసములు చేసి తాము దూరమున నుండునట్టి యీనాటి