పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదాసు మూల్జీ

ఇతఁడు 1832 వ సంవత్సరము జూలై 25 వ తారీఖున జన్మించెను. ఈతని పసితనమునందె తల్లి కాలధర్మము నొందుటచేఁ దండ్రి రెండవపెండ్లి చేసికొనిమాతృహీనుఁడగు నీ బాలకుని బెంచుమని తనతోఁబుట్టువు కప్పగించెను. ఈకృష్ణదాసు మేనత్త సంరక్షణములో నుండి బొంబాయిలోనియెల్ఫిన్‌ష్టన్ కళాశాలలో విద్య నేర్చుకొనుచుండెను. ఆ కాలమున నతఁడు రమారమి యిరువది యొక్క సంవత్సరముల వయసుగలవాడై నప్పుడు వాని విద్య కంతరాయము సంభవించెను.

గుజరాతి దయాన్ ప్రసారికమండలి యను నొక సభ గుజరాతులో నేర్పడి స్త్రీపునర్వివాహ విషయమున మంచి యుపన్యాసము వ్రాసినవానికి నూటయేబది రూపాయలు బహుమాన మిచ్చునట్లు ప్రకటించిరి. కృష్ణదాసు తద్బహుమానము సంపాదింపవలయునని యుపన్యాసము వ్రాయ మొదలుపెట్టెను. కొన్ని పుటలు వ్రాసిన తరువాత వాని వ్రాసిన కాగితము లెవరో వానికి దెలియకుండ తీసికొని మేనత్తకుఁ జదివి వినిపించిరట. పూర్వాచారములపై నత్యంత భక్తిగల యా యవ్వ యావ్రాతలు వినిన తోడనే పిడుగడచినట్లు నిశ్చేష్టయయి స్త్రీలకు పునర్వివాహము చేయుట మంచిదని వ్రాసిన పరమదుర్మార్గునిఁదా నన్న వస్త్రములిచ్చి పెంచుటయు మహాపాతకమే యని తక్షణమె వాని నింటనుండి యావలకు వెడల నడచెను. కృష్ణదాసున కిది పెద్దదెబ్బ. దీనిచే నతఁడు నిరాధారుఁడై యన్న వస్త్రము లిచ్చువారే లేకపోవుటచేఁ జదువు సయితము మానుకోవలసి వచ్చెను. అతడు కొంచెము పశ్చాత్తాపము నొంది యుప