పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్ మంగళదాస్ నాథూభాయి

మంగళదాస్ నాథూభాయి 1832 వ సంవత్సరం అక్టోబరు నెలలో బొంబాయినగరమున జన్మించెను. అతఁడు గుజరాతీలలో కపూల్ బనియాతెగలోఁ జేరినవాఁడు. అనఁగా నొక తెగ కోమటి యని అర్థము. అతని పూర్వులు కతేవారు ద్వీపకల్పమునందలి గోగ్లాయను పట్టణమునుండి వచ్చి బొంబాయిలో నివసించుచుండిరి. మంగళదాసుయొక్క తాతయగు రామదాసు మనోహర దాసు కాలమున నీ కుటుంబము ధనవంతమై ప్రఖ్యాతిఁ గాంచెను. ఇతని తండ్రియగు నాథూభాయి రామదాస్ శెట్టి కుమారుఁడు మంగళదాసు పదునొకండు సంవత్సరముల ప్రాయముగల గలవాఁడైనప్పుడే మృతి నొందెను. మంగళ దాసు కొంతకాల మాంగ్లేయభాష ప్రారంభించి పాఠశాలలోఁజదివి తరువాత నొక యుపాధ్యాయునిఁ బెట్టుకొని యింటివద్ద నింగ్లీషు నేర్చికొనెను. అతనికి బదునాఱవయేఁట రుక్మిణీభాయి యను నామె నిచ్చి బంధువులు వివాహముచేసిరి. తరువాత రెండుసంవత్సరములకు అనఁగా యుక్తవయస్సు వచ్చినతరువాతఁ వాని యాస్తి వాని కప్పగించిరి.

చిన్న తనమునుండియు మంగళదాసునకుఁ దనసంఘమునందుఁ బ్రబలియుండిన దురాచారములఁ దొలగించి కొన్నిమార్పులు చేయవలెనని తలంచుచుండెను. కపూల్‌కోమటులుచేయు హోళీపండుగల నాగరికులు చేయఁగూడదని మద్యపానాది దుర్వ్యాపారములు పెక్కు లుండెను. మంగళదాసాకార్యముల నివారించి పండుగ సలక్షణముగా జరుగునట్లు కొన్ని యేర్పాటులు చేసెను. ఆ యేర్పాటులు మంచివగుటచే జనసమ్మతములుగ నుండెను. గుజరాతీదేశమున