పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

మహాపురుషుల జీవితములు



వఱకు రామమోహనుఁడు తాను వ్రాసిన గ్రంథములన్ని క్రైస్తవ మతబోధకుల, ముద్రాయంత్రములోనే యచ్చు వేయుచు వచ్చెను. ఆమతబోధకులు రామమోహనుని వాక్యములు యుక్తియుక్తములుగనుండి జనుల యాదరణబడయుచుండుటచే నీర్ష్యఁ జెంది యతఁడు తమవ్రాఁతల ఖండించుచు నిచ్చిన కడపటి ప్రత్యుత్తరము నచ్చు వేయమనిరి. రామమోహనుఁడు పంతము వచ్చి నప్పుడు తీసిపోవు వాఁడుకాఁడు గావున దానే స్వయముగ నచ్చుకూటమును గొని తన గ్రంథము నచ్చొత్తించెను. ఈయిరువుర గ్రంథము లింగ్లాండునకుఁ బోయినప్పు డచ్చటివారు, బంగాళాబ్రాహ్మణుని యుక్తులకును, సర్వతోముఖ పాండిత్యమువరకును, వాద నైపుణ్యమునకును జాల మెచ్చుకొనిరి.

ఈసత్పురుషునకుఁ బరిశుద్ధమగు నుపనిషన్మతముపై నభిమాన మెక్కుడు గలుగుటచే భగవధ్యానము నిమిత్తము కలకత్తానగరములో నాత్మసభయను పేర నొకసభ నేర్పఱచెను. పిమ్మట వేదాధ్యయనము నభివృద్ధి చేయఁదలఁచి వేదమందిర మను నొక పాఠశాలను 1817 వ సంవత్సరమున స్థాపించెను. ఈమతములోఁ జేరినవారందఱు ప్రార్థనాదికములు చేసికొనుటకు 1830 వ సంవత్సరమున నతడు బ్రహ్మమందిరము నొకదానిని గట్టించి, దానిపోషణకయి కొంత మూలధనము సయిత మొసంగెను. హిందువులకు, మహమ్మదీయులకు క్రైస్తవులకు నుపయుక్తముగ నుండునటుల నొకమతము నిర్మింపఁ దలఁచి యుపనిషత్తులలో నున్న పరమార్ధమును గ్రహించి, యీ మతమును గల్పించెను. ఆయన వేదములనుమాత్రమే ప్రమాణములని యొప్పుకొనక, బైబిలు, ఖొరాను, జండవస్తమొదలగు మత గ్రంథములలోనున్న సత్యమును ధర్మమును గ్రహింపవలసిన దే యనియు, నవి యన్నియు వేదములవలెఁ బ్రమాణములే యనియు, నమ్మి ప్రజలకు బోధించుచుండెను. బ్రహ్మసమాజమే, పూర్వఋషులపరిశుద్ధా స్థికమతమని యాయన గట్టిగ నమ్మెను. తాను మతసిద్ధాంతము