పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజారామమోహనరాయలు

3


కొనెను. రామమోహనుఁ డంతట మనస్థ్సిమితము గలవాఁడయి యిరువదియవయేడు మొదలు యిరువదియాఱవ యేడువరకు ఇంగ్లీషు భాషయందుఁ గృషి చేసి, దానిం జులకగఁ జదువ వ్రాయఁగలిగెను. ఆ భాషకుఁ దోడు ఫ్రెంచి, లాటిను, గ్రీకు, హీబ్రూ భాషలయందు సయిత మాతఁడు ప్రవీణుఁడయ్యెనని చెప్పుదురు. క్రీస్తుశకము 1800 వ సంవత్సరమున రామమోహనుఁడు రంగపురము కలక్టరగు డిగ్బీ దొరగారి కచ్చేరీలో చిన్న గుమాస్తాగాఁ బ్రవేశించెను కాని దొర యాపిన్న వాని చాక చక్యమును దెలివి తేటలును గని పెట్టి, తనయెదుటి కతఁడు వచ్చినప్పుడు, నిలువఁబెట్టి పని పుచ్చుకొనననియు, చిన్న గుమాస్తాల కుత్తరువు చేయునట్టు చేయననియు, వాగ్దానముచేసెను. ఆచిన్న యుద్యోగమునుండి యతఁడు క్రమక్రమముగ జిల్లాసిరస్థదారుడయి తనకృత్యము లను జక్కఁగ నెరవేర్చి యధికారుల మెప్పొంది, 1813 వ సంవత్సరమున నుద్యోగమునుమాని శేషమగు జీవిత కాలము లోకోపకారార్థము గడపఁదలఁచి 1814 వ సంవత్సరమున గలకత్తా నగరమున గాపురముండ వచ్చెను. అతఁడు కలకత్తానగరము వచ్చునప్పటికి, మనదేశస్థితి యెట్లుండెనో యించుక చెప్పవలసియున్నది. బంగాళాదేశమున శాక్తేయమతమును దైతస్యమతమును వైష్ణవ మతము వృద్ధిలో నుండుటచే, శాక్తేయులకు వైష్ణవులకు మత ద్వేషములు తరుచుగఁ గలుగుచు వచ్చెను. నరబలులు, శిశుహత్యలు, దేశమందంటఁ బ్రబలియుండెను. వానికిందోడుగ నతిభయంకరము ననానుషంబు, నసహ్యమునగు, సహగమన మను దురాచార మొకటి భరతఖండమందంతటను, ముఖ్యముగ వంగదేశమందును దృఢముగ నాటుకొని యుండెను. ఈ సహగమనమునుభర్తృవియోగముచే నీలోకమున బ్రతుక నిచ్చలేకఁ గొందఱు పతివ్రతలు మనఃపూర్వకముగఁ జేయుచు వచ్చిరిగాని, కాలక్రమమున వితంతువు నెట్లో కాల్చి చంపి, యాస్తివేసికొనవలయు నను జ్ఞాతులును లోక