పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మహాపురుషుల జీవితములు


మహర్షులమతమున కిది విరుద్ధ మనియు జనులందఱు శిలావిగ్రహార్చనము విడిచి యేకేశ్వరారాధనము సేయవలసిన దనియు నీగ్రంథమున నతఁడు స్థాపించెను. తనకొడుకు సనాతనధర్మమగు విగ్రహారాధనమును ఖండించుచున్నాఁడని విని రమాకాంతరాయలు కోప పరవశుఁడయి యాయకార్యమును జేసినందుకు రామమోహనుని యింటనుండి వెడలనడచెను. బాల్య మింకను గడచిపోవకమునుపే, స్వతంత్రముగఁ జీవించుటకు ఱెక్కలు రాకమునుపే, యాగర్భశ్రీమంతుఁడయి చిన్న నాఁటనుండియుఁ గడుగారాబమునఁ బెఱిగిన యా బాలుఁడాకస్మికముగఁ దండ్రిచే నింటనుండి వెడలనడువంబడియు, స్వభావమున గంభీరుఁడగుటచేత హిందూదేశమునఁ బలుతావులుఁ దిరిగి యెట్ట కేలకు హిమాలాయపర్వతములు దాఁటి టిబెట్టుదేశమునకుఁ బోయి బౌద్ధక్షేత్రమగు లాసానగరముం జొచ్చి యచ్చటి భాషల నలవరచుకొని, బౌద్ధమతసిద్ధాంతములఁ గ్రహించెను. ఆస్తికుఁడగు రామమోహనుఁడు నాస్తికులగు నచటిబౌద్ధులతో నీశ్వర విషయములగు చర్చలంజేయ వాదములు ముదిరి భేదములయి తుదకు వానికిఁ బ్రాణభయము నాపాదించెను. మతద్వేషముచేత బౌద్ధగురువులు నిష్కారణముగా నాబాలునిఁ కడతేర్పబ్రయత్నింపగా నచటి స్త్రీలు కొందఱు వారికడుపు చల్లగ వానిని రహస్యముగ దాచి బ్రతికించి యావలకుఁ బంపిరి. అందుచేత నాఁట నుండి స్త్రీలయెడఁ గడుఁ గృతజ్ఞుఁడై వారి కష్టములఁ దొలఁగింప నాతఁడామరణముఁ బ్రయత్నించెను. కొడుకిల్లు వెడలుటమొదలు వానికొఱకయి బెంగఁగొని తండ్రి మరల వానిని పిలిపించి యాదరించెనుగాని, క్రమ్మర నాతఁడు బ్రాహ్మణుల మతాచారములను ఖండించుటచేత, తండ్రి వానిని రెండవమారింటనుండి సాగఁదోలెను. తరువాత కొంతకాలమునకు రమాకాంతరాయలు లోకాంతరగతుఁడుగాఁ ధారుణీదేవి కడుపుతీపిచేఁ గొడుకునుం బిలిపించి యింటనిలుపు