Jump to content

పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిసియస్సు

'నిసియస్సు' 'థ్యూసిడైడీసు' వీ రిరువురు తమ కాలములో ప్రజలను పుత్రవాత్సల్యముతోఁ జూచుచుండి రని మహా మహోపాధ్యాయుఁడైన 'ఆరిస్టాటులు' ప్రకటన చేసెను. 'థ్యూసిడైడీసు' పెద్దవాఁడు. 'పెరికిలీస'నువాఁడు ప్రజలపక్షము మాటలాడును; మొదటివాఁడు ధనికులపక్షము నవలంబించి యతనిని యెదిరించుచుండెను. 'నిసియస్సు' మిక్కిలి చిన్నవాఁడు. పెరికిలీసు కాలములో నితఁ డతనితోఁ గలిసి పని చేయుటయు, స్వతంత్రముగ పనిచేయుటయు కలదు. యుద్ధములలోకూడ నితఁడు చతురుఁడై యుండెను. పెరికిలీసు కాలాంతరగతుఁడైనపిదప, నితఁడు వ్యవహారస్థుఁడై , పనులను ప్రజల కింపగునటుల నెరవేర్చుచుండెను. ప్రజ లతనిని నమ్మిరి.. వారిచేత నతఁడు సన్మానింపఁబడెను. వారిని నొప్పించుట కతఁడు భయపడినందున, వా రతనిని ప్రేమించుచుండిరి. స్వభావము చేతఁ గొంత సభాకంపముఁ గలవాఁడైనను, యుద్ధములలో నతఁడు జయమును బొందుటచేత నతనిని వారు మన్నించిరి.

ప్రభు మంత్రోత్సాహశక్తులు గలిగి పెరికిలీసు రాజ్య

67