పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకర్గసు

133


లకు ప్రసన్నుఁడై, యామె ముఖత పలికె సని ప్రజలు విశ్వసించుచుండిరి.

ఇక్కడకు 'లైకర్గసు' వచ్చి, బలు లిచ్చి, సోదె యడిగెను. అతఁడు చేసిన పను లన్నియు శాశ్వతముగ నుండి, ప్రజలకు రాష్ట్రమునకు. గీర్తివచ్చు నని సోదె చెప్పిరి. ఆ మాటను వ్రాసి, యతఁడు స్వదేశమునకుఁ బం పెను. అతఁడు కష్టములు పడ లేదు; అన్న దూరుఁడు కా లేదు; మంచి కాలములో నుండెను; రోగము లేదు; విచారము లేదు; అన్ని విధముల సుఖముగ నుండెను. అయిన, నతఁడు జీవించుట కిచ్చ లేక, యుపవాసములు చేసి శరీరమును గృశింపఁ జేసి, కాలమునకు వశుఁ డయ్యెను. అతఁడు నియమించిన నియామకముల ననుసరించి నందున, నతఁ డేర్పాటు చేసిన రాజ్యాంగముల నయిదువందల సంవత్సరముల వఱుకు స్పార్టనులు నిలఁ బెట్టిరి.