పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

పాంపేయుని తండ్రి 'స్ట్రాబుఁడు'. తండ్రి దురాశాపరుఁ డగుటచేత నతనిని రోమనులు గర్హించిరి. సన్నిపాతమువలన నతఁడు మృతినొందెను. స్మశానమునకు శవమును దీసికొని పోవుచున్న సమయమునఁ గోపముఁ బట్టలేక వారు దానినిఁ బీకి పారవేసిరి. తండ్రి నెంత నిందించిరో కుమారుని వారంత సుతించిరి. పాంపేయునిఁ బ్రేమించుట కనేక కారణములు గలవు. ఆతఁడు సంగర కేళీనిపుణుఁడు; శరశిక్షాశాలి; గురులకు భయస్థుడు; ఉదారుఁడు; దయార్ద్రహృదయుఁడు; శౌర్య ధైర్య గాంభీర్య ధురంధరుఁడు; వినయరతుఁడు; హృదయ విదుఁడు; మానధనుఁడు ప్రజల పొత్తు నభిలషించువాఁడు. అతఁడు మఱియు సముచితసంభాషణంబులచేతఁ బ్రజల నం కించుటచే వా రతని నభినందించిరి. చెలువంపుమేనును జెన్ను మొగంబును గలిగి, వారి నతఁ డాకర్షించెను. నేత్రములలో నతనికి సిరియుండు. అతఁడు మహా అలెగ్జాండరును బోలి యుండెను. మానసికముగ నితని పనుల నతఁడు స్మరించు చుండెను.

అతఁడు తండ్రితోఁగూడఁ బోరాటమునకు వెల్లియుం

92