64 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు
[భయముతో సుశీల ప్రవేశించును.]
రాణా : ఓసీ, ఆవైద్యులు వచ్చినప్పుడు నీ వంత:పురమున నుంటివా ?
సుశీ : [గొణుగుచు] వుణ్యానండి
రాణా : మీరా అ వైద్యులతో నేమైన మాటలాడినదా?
సుశీ : అమ్మగారు ముందటి మాదిరిగానే మాట్లాడుకుంటూ వుణ్యారు. వైద్దుగులను చూచి అమ్మగారు "వచ్చితివా, నన్ను తీసుకొని పొమ్ము, ఎంతకాలము వేచివుందును" అని వేడుకొంటూ వుణ్ణింది.
రాణా : ఆఁ ? [క్రోధమూర్తి యగును]
సుశీ : అమ్మగారితో గూడా రాత్రంతా మేల్కొనుండి అప్పుడే తెలియకుండా కన్నుమాల్చినాను.
రాణా : [కోపముతో] అమ్మగారు - అమ్మగారు - ఆ అమ్మగారిని నిన్ను ఒక్క త్రాటనే యురివేయించెదను. నీకంతలోనే నొడలు తెలియని నిద్రవచ్చెనా ? దీని నిద్రమత్తు వదలునట్లు గుఱ్ఱపు కమిచీతో మేలుకొల్పుడు.
సుశీ : [దు:ఖముతో] ఈతప్పు మన్నించండి దొరగారు. బుద్ది గెడ్డిదిని నిద్రబొయ్యాను.
[బంట్రోతు నెట్టుకొనిపోవును.]
శ్యామ : మహప్రభూ, యిట్టి సందర్భముల తొందరపాటు తగదు. ఆ తెలివితక్కువదాసి, చెప్పిన తబ్బిబ్బు మాటల నాధారము చేసికొని మీ సందేహమును బలపఱచుకొనఁ బోకుఁడు. అది నిద్రమత్తున నుండి పూర్వాపరముల నెఱుంగక అసంగతముగ కొన్నిమాటలు చెప్పెను.
రాణా : శ్యామలరావ్, మీ సదుద్దేశము ప్రశంసనీయము. కాని,