పుట:Kumbharaana020881mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

సింహుడు యుక్తవయస్కుడు.

సుశీ : రాణిగా రొంటరిగ వుంటారు. మల్లీవస్తాను. [నిష్క్రమించును.]

ద్వార : తలారివాడొకడు ప్రభువులవారి దర్శనానికి కనిపెట్టుకోని వున్నాడు.

శ్యామ : ప్రభువుగా రిప్పుడు కార్యాంతర నిమగ్నులు. రేపువచ్చి మనవి చేసికొమ్మనుము.

ద్వార : [నిష్క్రమించి, మరలవచ్చి] వాడిది అగత్తెమయిన మని వంట. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడంట.

రాణా : ఏమది? వానిని రమ్మనుము. - నాదర్శనమును గోరువారి నెవ్వరిని ఆటంక పెట్టకుఁడు. అంతకన్న నాకు ఉత్తమ మయిన కార్య మేమున్నది?

శ్యామ : చిత్తము.

[తలారి మురళీదాసు ప్రవేశించును.]

మురళిదాసు : మహాప్రెభో, నాది అగిత్తెమయిన మనివండి. పెళ్ళాం బిడ్డల నోటికాడ కూడండి. [వంగి దణ్ణము పెట్టును.]

శ్యామ : ఏమిరా నీమనవి ! ఒకటి రెండు మాటలతో విన్నవించుము.

మురళి : చిత్తం మహాప్రెభో, యీయాళపొద్దున, అంటె పొద్దు అల్లాడి కెక్కినాక, [నిర్దేశించును] నేనొక బంగారు మోరీ యెత్తుకోని మార్చుకొందామని దునీచంద్ సేట్ దగ్గిరికి వెళ్ళినాను. ఆమోరీ తీసుకొని దాని కరీదు పది రూపాయలని అయిదు రూపాయలిచ్చి మిగత పైకానికి పదిరోజులు తాళి రమ్మన్నాడండి.

రాణా : కానిమ్ము.