పుట:Kumbharaana020881mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఐదు] కుంభ రాణా 41

                      చలిది చిక్కంబుల సడలించి యన్నంబుఁ
                             బెట్టవేయని పేర్మిఁ బిలువరాదొ;
                      అలసితి నొక్కింత తలిరువీవన వీవు
                             ప్రేయసీ, యని యాజ్ఞవెట్టరాదొ;
                      మనసయ్యె భువన మోహనగాన మొనరింప
                             మురళి యిమ్మని చూడ్కి నెఱపరాదొ;

                      తలిరుటాకులు పూవులు దండగట్టి
                      మెడను గీలింపుమా యని నుడువరాదొ;
                      అట్టి యుపచారముల కే ననర్హ నైన
                      నిష్టముండిన రీతి నన్నేలరాదొ!
                                                [ధ్యాననిమగ్నయగును]

[అగ్బరు తాన్‌సేనులు వైద్యుల వేషముతో ప్రవేశింతురు]

అగ్బరు, తాన్‌సేనులు : తల్లీ, చరణదాసులము. [దండము పెట్టుదురు.]

మీరా : [ఆనంద పారవశ్యమున నుండును]

తాన్ : దర్శనమాత్రముననే ధన్యులము.

అగ్బ : గానమువిన్న నేమి యగుదుమో!

మీరా : నందనందనా, దివ్యసుందరశరీరా, నీవంటి సుకుమార కుమారుని ఆకొండ తిప్పలలో ఆ యరణ్యములలో పసుల గాచుటకు ఆ యశోదాదేవి యెట్లుపంపెను? ఆనందుఁ డెట్లియ్యకొనెను ? తలిదండ్రుల హృదయము లింత కఠినముగ నుండునా ?