పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మా తల్లిదండ్రులు మన్నన దళుకొత్త
               నేఁ గోరినవియెల్ల నిడుచుఁ బెంప
నొకనాఁడు నాయీడు నువిదలతో గూడి
               యాడుచు నుండ మాయయ్య చూచి


తే.

నాదు గుణరూపములకు నానంద మంది
యత్తమామలు మఱఁదులు నాడుబిడ్డ
లుండ సిరులందియున్న చోటోకటి గాంచి
చిత్తమున నన్ బరాధీనఁ జేయఁ దలఁచి.

93


క.

ఆ విప్రున కగ్రసుతుం
డై వెలసిన చంద్రకునిఁ బ్రియం బెసలారన్
రావించి పరిణయం బొగి
గావించిరి యగ్నిసాక్షికముగ నృపాలా!

94


క.

తగు మొదవులేను దాసీ
యుగళము వస్త్రాభరణసమున్నతి యరణం
బుగ నిచ్చి యంత నను జ
క్కగ మావా రనిచి రత్తగారింటి కొగిన్.

95


తే.

ఏను నుబ్బుచు నత్తవారిల్లు సొచ్చి
పొలుపు దీపింప నాసాటి పువ్వుబోండ్లు
మెచ్చఁ బనులందు నేరుపు లచ్చుపడగ
నిపుణమతి నొప్పుచుందును నృపవరేణ్య!

96


సీ.

సుకుమారనయ్యు నే నొకవేళయందైన
               నలసితి నని యుస్సురస్సు రనను
ఈవలి దావల నిడకున్నదాన న
               య్యును నోర్చి చెప్పినపనులు మఱువ
నఖిలపదార్ధమ్ము లనుభవించినదాన
               నయ్యు పెట్టరు పొయ్యరని తలంప
గారవమ్మునఁ బెంపు గనుదాన నయ్యును
               గసరులఁబడి మదిఁ గ్రక్కసింప