పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నరిభయంకరమూర్తులై యొప్పురాహుత్తు
               లొకచక్కి మాఱుగే లూఁది నిలువ
గాయకవందిమాగధబృంద మొకవంక
               నమరి యాత్మీయగీతములు వాడ


తే.

నాదిగర్భేశ్వరా! పరాకా! యటంచు
సౌవిదల్లులు దన్ను హెచ్చరిక సేయ
రమణు లిరుగడ వింజామరములు వీవ
నరవరేణ్యుండు సింహాసనమున నుండి.

64


క.

ఆటలఁ బాటల బహువా
చాటోక్తులఁ గొంతప్రొద్దు చనునంత నిరా
ఘాటముగ వేఁటతమి మదిఁ
బాటింపుచు విభుఁడు సైన్యపతితో ననియెన్.

65

రాజు వేఁట కేగుట

మ.

సదసత్కార్యవిధిజ్ఞులార! మృగయాసంచార మొక్కింత స
ల్పుదమే! యంచు వచింప నియ్యకొని యో భూనాథ! యివ్వేళ మం
చిద మాకున్ బ్రియమయ్యె దేవర బలశ్రీ మీఱ, నానామృగా
స్పదకాంతారవిహారలీలలఁ జరింపన్ జెంత వీక్షింపఁగన్.

66


క.

అని పల్క, నాటవికులన్
గొనిరండని భటులఁ బనుప గొబ్బున వారల్
చని పిలుచునంతఁ బ్రజ తమ
వనచరభావంబుఁ జూడ వచ్చిరి సభకున్.

67


క.

వల లురిద్రాళ్లును దగు బో
నులు గాలమ్ములు గదాధనుశ్శరకుంతం
బులు మొదలగు సాధనములు
నలవడ ధరియించి భీషణాకృతు లొప్పన్.

68