పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ప్రథమాశ్వాసము


వ.

పరమపురుషార్థవేత్తలగు భాగవతోత్తములం గీర్తించుట కీర్తికరంబును
మదీయ కైంకర్యవిశేషంబు నగుంగావున నిత్తెఱంగునం గావించి కృతార్ధుండవు
గమ్మని యానతిచ్చిచనియె నంత మేలుకాంచి నామనంబున నిట్లని యూహించితి.

18


ఉ.

ఎక్కడిచోద్య మజ్జగదధీశ్వరుఁగూర్చి మహాతపమ్ము ము
న్నైక్కడినుండి చేసితి నహేతుక మాతని సత్కటాక్ష మొ
క్కొక్కనిపైఁ బొసంగు ననుచుండెద రార్యులు తథ్యమయ్యె లోఁ
జిక్కినభక్తి నర్పణముఁ జేసెద మత్కృతి రామమూర్తికిన్.

19


సీ.

శుభకరాపస్తంబసూత్రుండు కౌండిన్య
        గోత్రపవిత్రుండు గుణవిశిష్టుఁ
డనుపమశేషాన్వయాంభోధిచంద్రుం డ
        హోబలదేశికుం డొనరఁ దనదు
సతియందుఁ బుత్రపంచకము నాపాదించె
        నందగ్రజుండు రామానుజార్యుఁ
డమ్మహాత్ముండు సీతమయను నిజదేవి
        వలన శ్రీభట్టరాహ్వయకుమారుఁ


తే.

గనియె నా శాంతినిధికి రాగమయు సత్య
భామ యను భార్యలిరువురు భవ్యమతులు
సరవి రాగమదేవికి సంభవించె
సరసగుణశాలి వేంకటాచార్యమౌళి.

20


తే.

అమ్మహాత్ముఁడు లక్ష్మమ యనెడి పత్ని
వలన మువ్వురిఁ దనయుల నెలమి గాంచెఁ
జెలిమి రామానుజుండును జెన్నభట్ట
రను సహోదరు లిరువు, రే నగ్రజుండ.

21


క.

ఇల రఘునాథార్యుండన
వెలసితి లక్ష్మణమునీంద్ర విమలపదాబ్జం
బులు శరణంబని నమ్మితి
లలి భాగవతార్చనాభిలాషంబెసఁగన్.

22