ఈ పుట అచ్చుదిద్దబడ్డది
287
కాకపురీ నరాగ్రణులచే సభ మహో
దంచిత స్థితి సంఘటించితీవె
ఆ సభాధీశ్వరుఁడలరి కోరిన పద్య
కృతులు మాచేతఁ బల్కించితీవె
తత్సభా స్థలి సుకవి విద్వన్నరేంద్ర
వరులచేఁ బెక్కు మన్ననల్ జరిపితీవె
మహిమ నీ కాకినాడ నస్మద్విజయపు
ధ్వజము నాటించితీవె శ్రీ వాగ్భవాని!
న్యాయవాదులు ధరానాథు లీపురి వర్ణ
నీయు లెంతేని మన్నించినారు
పండితేంద్రులు కవిప్రవరు లీనగరి న
ద్భుత కళాకౌశలుల్ పొగడినారు
గుణరాశి కొవ్వూరి కులుఁడాది రెడ్డి యి
వ్వీట హెచ్చున గౌరవించి నాఁడు
అనఘ పండా వేంకటాచలుండిచ్చోట
మేటి నూఱార్లిచ్చి మెచ్చినాఁడు
సుగుణశీలి బ్రహ్మానంద సూరి మౌళి
శ్రేష్ఠుఁడీయూరఁ గడు నాదరించినాఁడు
కాన నింతకు నీ కృప కారణంబు
తల్లి! కైకొమ్మ యిదియె వందన శతంబు
కాకినాడ
2-6-1912
ఇట్లు
చేగంటి బాపిరాజు
(సంకలన కర్త)