పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

రామకృష్ణ గ్రంథమాలలోని సమస్యాపూర్తి

కుండను గొండఁ జొచ్చె నిదిగోయని పల్కెను విస్మయమ్మునన్
గొండలు రేఁగిలోకములగుండలుసేయుచునుండఁజూచి యా
ఖండలుఁడుద్ధతుండయి యఖండపరాక్రమ మొప్ప ఱెక్కలన్
జెండఁగడంగుటన్ దెలిసిశీతనగాత్మజుఁడబ్ది వజీరా (24వ పుట)

కొప్పరపువారి సమస్యాపూర్తి

హరుఁడు గణపతికిఁ బోలెన్
సరసీజాక్షుండు నాభిజన్మునకుఁ బలెన్
గురుకీర్తిగన్న యాసా
(గరుఁడుడు గణపతికిఁ దండ్రిగావలెఁ జుమ్మీ.)

ప్రకా : ఎక్కడి కెక్కడ, ఆ కవిత్వ మెక్కడ ఈ కవిత్వమెక్కడ? నక్కెక్కడ దేవలోకమెక్కడ! ఎట్లో యతిప్రాసములతికి పేకేజీ చేసినట్లది యున్నది. ఇది చక్కఁగా గరుడుని సాగరునిఁగఁజేసి కడు సొగసుగాఁ గనపఱచి పూరించు నటులున్నది. ఇంకను దారతమ్య మున్నదా! అర్ధబిందు విషయమునఁ జర్చ యించుక కల్గినను ననివార్యముకాదు.

శశి : నిషిద్ధాక్షరి యిరువురును జెప్పిరి. కాని పిఠాపురపువారు సంస్కృతములోఁ జెప్పిరి. వీరు తెలుఁగులోఁజెప్పిరి. ఇందుఁ గష్టమేదియో నీకు నేను జెప్పనక్కఱలేదు గదా!

ప్రకా : అవును. తెలుఁగులో జెప్పుట సంస్కృతముకన్న ననేక విధములఁ గష్టము.

శశి : కొప్పరపువారిని అలఁతి, వలతి, పొలతి, గలతి. అనుపదములు చేర్చి సత్యభామ నరకాసురునితోఁ బోరువిషయము వచ్చునట్లు చెప్పుమనిరి.

ఇట్లు కొన్ని మాసపత్రికలలో వీరి వృత్తాంతము ప్రచురింపఁబడెను.