264
చంపకమాలిక
పురికొను కాంక్ష మొన్నఁ బదుమూఁడవ తేదిని నా విభుండు కొ
ప్పరపు శతావధాన కవివర్యుల నార్యులఁబిల్చి యెట్టియా
పుర శివగిర్నృపాలకులు మొక్కపురాంకుఁడు సుబ్బరాట్సుధీ
వరుఁడు గనంగ గంటకును బద్యశతత్రితయంబుగా నలే
శ్వర చరితంబుఁ జెప్పుమని పల్కిన నాకవులట్టులే మహా
త్వరిత గతిం రచింపఁ గని తద్దయు సంతస మంది ప్రేమతో
నరుదగు వేయినూట పదియాఱులు రౌప్యములిచ్చి తన్పె నీ
ధరణిపుతో సమానులగు ధార్మికులుందు రనంగఁ జెల్లునే.
మున్ను సంస్కృతకవుల సమ్మోద మొదవఁ
బోషణ మొనర్చినట్టి యాభోజవిభుని
ఆంధ్రకవులను బోషించినట్టి కృష్ణ
దేవరాయలఁబోలు నీ భూవిభుండు
ఈ కొప్పరపు శతావధానులయందుఁగల సామర్థ్యములు మిగుల మెచ్చఁ బడినవగుటచే అభినవ సరస్వతియను నొక మాసపత్రికలో 1911 సం, ఫిబ్రవరి 2వ సంచిక నిట్లు ప్రచురించిరి.
అత్యద్భుతవిమర్శనము అని పిఠాపురపు సంస్థాన కవీశ్వరులగుఱించినది
ప్రకృతము వీరియష్టావధానాంతర్నాటకమునకు నాంది
ప్రారంభింపఁబడుఁగాక - అంతర్నాటకము
ఒకనికినుప్పు వేరొకనికుల్లి యిఁకొక్కనికాముదంబు మి
ర్చొకనికిఁ గందులొక్కనికి నొక్కనికిన్ బెస లల్లమింక నొ
క్కొకనికి నేక కాలమున నొప్పుగనిచ్చుచుఁ బద్దువ్రాయున
య్యకు భగవంతుఁడిచ్చు నలయష్టవధానికి బచ్చుకున్ సిరుల్
(నాంద్యంతమున)