పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కవితల్ గూర్చెడు వాఁడు నూరుగురి కొక్కండుండు నందెన్ననా
శువుగాఁ చెప్పెడువాఁడు తక్కు వెటులున్ జూడంగ నవ్వారిలో
నవధానంబులుసల్పుజాణలుకడున్ స్వల్పంబుగానుండ్రు గా
ని వచోధోరణియందు మీసములు క్షీణిన్ లేరుముమ్మాటికిన్

కంటిని మీస్వరూపమును గంటిని మీసదసద్వివేకమున్
గంటిని మీవచఃఫణితిఁ గంటిని మీకవితావిలాసమున్
గంటిని మీసుమేధ మఱిఁ గంటిని మీయవధాన పద్ధతిన్
గంటిని మీ ప్రభావమును గన్నులపండువుగాఁ గళానిధుల్

ఆసుధాధారఁబోలు మీయాశుధార
నాలకించినఁ గర్ణరసాయనముగ
నున్న హేతువుచేత మిమ్మెన్నితి నిటు
లాశుకవిచక్రవర్తి పదాంకులార!

ఇట్లే కవివరేణ్యులచే మెప్పుగొనిన యీ సోదరుల గుఱించి చెన్నపట్టణమున శ్రీ కానుకొలను త్రివిక్రమరామారావుగారను నొక సుకవి వీరి యవధాన సభలలోఁ బృచ్ఛకుఁడుగా నుండి వీరికిచ్చిన సమస్యలు

"కామిని పాదనూపురము ఖంగున మ్రోఁగదు హేతువేమొకో ”

అనియుత్పల మాలచరణమొకటి సమస్యగానిచ్చి యిది యుత్పలమాలలో నుండఁగూడదని యడుగుటచే

తన జారకృత్య మితరులు
గనకుండఁ బటంబుఁజుట్టెఁ గాళ్లకిపుడు కా
మిని పాదనూపురము ఖం
గున మ్రోఁగదు హేతువే మొకో, యన నేలా?
"సంయమి వరుఁడౌటఁ గుదిరె సంసృతి సుఖముల్ "