పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

శ్రీ బొద్దికూరపాటి వేంకటరంగము నాయుఁడుగారిచే రచింపఁబడిన చంపకమాల (మఱొకసభలో)

పరమ తపస్వి యాశుకవి పండితలోక విధాత భూమిని
ర్జరకులమౌళి గండుషిత సర్వశృతిస్మృతి దర్శనుండు దు
స్తర బహుబంధ గర్భముఖ సర్వకవిత్వ విశారదుండు దు
ష్కర వివిధావధాన శతకల్పనుఁడద్భుత ధీవిరాజి భా
స్వర పరతత్త్వ వేది గణపత్యభిధాన సుధీశ్వరుండు ధీ
గురుఁడగు భానుమూర్తి కవికుంజరుఁడిద్ద యశస్వియౌ ప్రభా
కరకవి పండితుండు శత ఘంటము వేంకట రంగశాస్త్రి దు
ర్దరమతి యాంధ్ర వాల్మికి పదాంకుఁడు వావిలి కొల్నుసుబ్బరా
డ్వర కవి పర్ణశాలకుల వార్ధి విధుండు నృసింహ సూరియున్
మఱియు ననేక పండిత సమాదృతమైన భవత్కవిత్వమున్
సరిగను మాదృశుల్వినుతి సల్పఁగ శక్తులు గారహో సహో
దర కవులార! మీకవనధాటి మహామహిమంబుఁజూడఁగా
సరసిజ భూ కళత్ర ముఖసారస భవ్యకురంగ నాభకే
సరఘనసార సమ్మిళిత సౌరభ సాంద్ర మనోబ్జ వీటికా
గురు గురు సౌర బంధుర సుగంధ ఘుమంఘుమ వైభవంబునౌ
సురుచిర హృద్యపద్య పద శుంభదలంకృతి మాధురీ మనో
హరగతి గోస్తనీ బిసరుహప్రభవాచ్ఛ మరంద శర్కరే
క్షురస రసాల పేశల సుకోమల సార సుధాప్రవాహమై
వరలి శిరీష మార్దవ మవారిగఁ గన్పడు నాశుధార పెం
పరయఁగ వాయు వేగముఁ దదశ్వజవంబు సహస్కరాశ్వ స
త్వరము మహీధ్ర నిస్సరదవారణ నిర్‌ఝర రంహమాశుగా
తిరయము వృష్టిధారగతిఁ దీవరమున్ ఖగరాడ్జవంబు మో