పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
239

ఘోర సింహంబు లట్టుల కొప్పరంపు
కవులు చనుదెంచి నాటిరీ కాకినాడ
యందు కవితోన్నతిని విజయధ్వజంబు
మిన్నయై దీని పీకు మగన్న యెవఁడొ?

కొండవీటి మహాగుహఁ గూర్కు జెందు
సింహములు రాఁగ నీ గ్రామ సింహములకు
బ్రతుకుఁ దెరువును వర్తన పరిఢవిలునె?
చాటు మాటున మొరుగుటే జరుగుఁ గాక.

బుఱ్ఱ గొరిగించి సున్నపు బొట్లు పెట్టి
ఖరము నెక్కించి యూరేగఁగా నొనర్చి
మాల దాసులు ఛీయని గేలిగొట్ట
తిరుపతిని వేంకటన్నను త్రిప్పినాము.

కట్టితిమి విజయ ఘంటిక
మొట్టితి మెసరేఁగి కుకవి మూర్ధము లగలన్
బట్టితిమి కాకపురి జయ
మట్టిట్టన రాని మీ దయాశక్తి శివా!

5. శ్రీ రాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దరు వారి పుత్రిక వివాహ సందర్భమున తిరుపతి శాస్త్రిగారు పద్యములను చెప్పుచు ఒక పద్యమిట్లు చెప్పిరి.

ఎలమిన్ సత్కవివై ధరాధిపతివై ఈలీల నీకూతు పెం
డిలికిన్ సత్కవులందఱన్ బిలిచి పాండిత్యంబు మన్నించుచో
పులులన్ మేకల నొక్క చెర్వున జలమ్ముం ద్రావఁగాఁ జేయు చ
ర్యలఁ జూపించితివయ్య! శ్రీ భుజగభూపా! ....