పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
237

జననుత శక్తి సంపద నసాధ్యు లభేద్యులునైన వారితోఁ
ధన లఘు శక్తిఁ జూడక మదంబున మార్కొనఁ జూచు వాఁడిఁకే
మన శతతాళ దఘ్నమగునట్టి మహాహ్రదపాత మాత్మనా
శనమును గోరి సేయుటకు సాహసికుండగు వానిఁ బోలఁడే.

తిరుపతి వేంకటేశ కవి ధీరుల శిష్యుల మంచు చాటి మా
గురువులు వారటంచుననుకొన్న ప్రభాకర శాస్త్రి ముఖ్యులి
ప్పరుసున దుర్వివాదముల పాలయి దుర్యశముం గడించిరే
హర హర! బాల చేష్ట విడనాడని నీవొకరుండు దక్కగన్.

ఆశలడంగి నీ గురుల యంతటి వారెదిరింపలేక యా
వేశము దక్కి యుండి రిఁకఁ బిన్నవు కాఁగలవాఁడ విప్పుడీ
యాశుకవీంద్ర సింహముల కాగ్రహమున్ కలిగింపఁ బోక, వ
త్సా! శివరామ శాస్త్రి! సుగుణాఢ్యుఁడవై యశమున్ గడింపుమా.

4. గుంటూరులో తిరుపతి శాస్త్రిగారు కొప్పరపు కవులను గూర్చి “కొప్పరపు వారు గోదావరి దాటి వచ్చిన బుఱ్ఱ గొరిగింపమా”, అన్న మాటలు దృష్టిలో పెట్టుకొని, కాకినాడలో కొప్పరపు కవులు తిరుపతి శాస్త్రిగారిపై కోపముతో చెప్పిన పద్యములు.

బుఱ్ఱ గొరిగించెద నటంచు బొఱ్ఱ బలిసి
యెవ్వఁడో పల్కెనఁట తొల్లి హీనుఁడగుచు
కంచు దివిటీన వెదకినఁ గానరాఁడు
ప్రాణముండెనొ లేదొక్కొ! పశువొ? నరుఁడో?

జందెంపుఁ బందెంబు సంధించు వారల
            జాడింపమే సభాస్థలికిఁ జేర
తొడదట్టి కడు మిట్టిపడు నట్టి వారల
            జాడింపమే సభాస్థలికిఁ జేర