పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236


ఆగ్రహ సందర్భములు

1. గుంటూరులో రంగావఝల హనుమయ్యగారు అను ప్లీడరు గారింటిలో శ్రీ తిరుపతి శాస్త్రిగారు అనవసరముగా కొప్పరపు కవుల ఆశుకవితను విమర్శింపగా, కొప్పరపు సుబ్బరాయకవికి కోపమువచ్చి అన్నమాటలివి.

తమకు సాధ్యముగాని యద్దాని నొరులు
ఖండనము సేయు టెందును గలదు కాదె

2. గుంటూరు సభలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు “ఈ కొప్పరపు కవులు మాతో సమానులు కారు. మాతో సమానముగా కూర్చుండుటకు వీలులేదు", అని అనగా కొప్పరపు సుబ్బరాయ కవిగారు ఆగ్రహముతో కొన్ని ప్రతిజ్ఞా పద్యములు చెప్పిరి. (ఈ పద్యములు చీరాల శతావధాన పీఠికయందు కలవు.)

3. తిరుపతి వేంకట కవుల శిష్యులైన శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారు గన్నవరములో కొప్పరపు కవులు సభజరుపుచుండగా, కొప్పరపు కవులపై కొన్ని ప్రతిజ్ఞా పద్యములు వ్రాసిన కరపత్రములు పంచుచుండగా, ఆగ్రహముతో కొప్పరపు సుబ్బరాయ కవిగారు చెప్పిన పద్యములివి -

రోసమున్న నిజంబైన మీసమున్న
పాఱిపోవుట కూడదు పందవగుచు
ద్వైత వనమున పాండవోత్తముల చేత
సింధుపతి పడ్డపాట్లు గాంచెదవు రమ్ము.