పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
231

గౌరవించెనుగాని త ద్గౌరవంబు
సహజమదిగామి నిటు వ్రాయఁ జనియెనధిప!

ఆ ధనేశ్వరు దార విద్యావతియును
సత్కుటుంబాగతయునైన సాధ్వియగుటఁ
బుణ్యవతి వానికీవలెఁ బుణ్యమెంతొ
కాక లభియింపదా యోగ్యుకార్యములను.

నాఁటి సాయంసమయంబున కటనుండి పయనంబై శ్రీ కందిమళ్ళాన్వయ వార్నిధి సంపూర్ణ సుధాకరుండగు శ్రీ మద్వేంకట రామ నారసింహ ధరావిభుండు నెలకొన్న యశ్వరాట్పురవర్యంబు నత్యంత సమ్మోదంబున మంగళతూర్య నాదంబులు శుభసూచకంబులై శ్రవణపర్వం బొనర్చుచుండ మలయ మారుతార్భకుండనుకూలుండయి తోననడువఁ గొంత ప్రొద్దేగుసరికిఁ జేరునంత.

వినుతగుణాభిరాముఁడగు వేంకటరామనృసింహరాయ రా
డ్జనమణి యస్మదాగమన శబ్దము వీనులవిందుసేయ మ
మ్మునుపఁగఁజేసియాత్మభవనోత్తమమందొకచోట సత్కళా
ఖనియగు విశ్వనాథబుధగణ్యునకున్ మము నప్పగించియున్

రాతిరిచాలయయ్యెను గరంబుశ్రమంబునఁ జేరియుందురీ
రాతిరియాపిప్రొద్దుటవరంబగు ప్రీతినిఁ జూపుఁడంచు భూ
నేతవచించెనంచు నవనీసుర వర్యుఁడు తెల్పి భోజన ప్రీతులఁదేల్పసౌఖ్యసముపేతులమైశయనించిరాతిరిన్

ప్రాగద్రిన్ దీనవల్లభుండు పొడసూపం గాల్యకృత్యంబు లు
ద్వేగప్రక్రియఁదీర్చి యన్నృపవరున్ వీక్షింప మేమెంచుచోఁ
దాఁగట్నంబనిపంచె గౌరవయుత ద్రవ్యాంశుకశ్రేణి ని
ప్డాగాథన్‌వివరింపనేల తుదకత్యానందముం గూర్చుటన్