216
ఆరామయుగళ మహాశ్వోష్ట్ర బహుదేశ
సురభి వృషాదులఁ జూడఁజేసి
దినమొక్కగడియఁగాఁజన నర్హమధురప్ర
సంగంబులను బ్రహర్షంబుఁగూర్చి
సమధిష్ఠితద్విపేంద్రము చెంత గజరాజ
మెక్కించి గరిమనూరేగఁజేసి
శతవధానంబునుసల్ప నేనూటప
దాఱులు స్వర్ణభూషాదు లొసఁగి
అనువర్షమేతాదృశానందమొనర వ
ర్షాశన పత్రంబునప్పగించి
అశ్వరాట్పుర రసికాప్తభూవర గౌర
వముల మేమొందెడు వలనుదీర్చి
దినదినాధికతరాత్యనురాగ సన్మాన
ముల మమ్ముఁదృప్తాత్మకుల నొనర్చీ
సత్కవీశ్వరులకు సద్యశంప్రియులగు
సత్ప్రభులు సల్పఁదగినవి సల్పి యుత్త
మప్రశంసలఁగొను నిన్నుమనుచుఁగాతఁ
గృప జగత్కర్తి శ్రీనాగ నృపవరేణ్య!
నర్సారావుపేట పట్టణములోని సుప్రసిద్ధ న్యాయవాదులగు బ్రహ్మశ్రీ చింతలచెఱువు కోటేశ్వరరావు పంతులు గారినిగుఱించి శ్రీ రాజావారడిగిన ప్రశ్నమునుబట్టి చెప్పినది
నరసరాట్పుర సర్వనరలోకహితుఁడయి
న్యాయవాది యశోభినంద్యుఁడయ్యెఁ
గవిబుధాశ్రిత బంధుగణమిత్రచయకల్ప
వృక్షమై సకలసంవినుతుఁడయ్యె