పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
215

శ్రీరాజావారి సత్కారములు

ఏమేగుదెంచుట లెఱిఁగి ప్రత్యుత్థాన
          వందనాదుల గౌరవము ఘటించి
రాకకాలస్య కారణమెఱుంగఁగఁగోరి
          కుశలప్రశంసలఁ గూర్మినెఱపి
సతియుఁదత్సహజుఁడాస్థానికోద్యోగులు
          నానందపడుట కాహ్లాదమంది
శ్లాఘ్యాసనోత్తమ శయ్యాదికముల మ
          మ్ముఁ దివాచిమేడ నిమ్ముగనునిల్పి
సకలోపచారముల్ సల్పనిత్యముఁజెంత
          నివసింప భృత్యుని నిర్ణయించి
పైపరామర్శంబుపరఁగ ననంత రా
          మాఖ్యు ముసద్ది నాయత్తపఱచి
ఏలూరునుండి ప్రత్యేకంబుగాఁబాక
          నిపుణుఁ బిల్పించి వండింపఁజేసి
ప్రాతరాహ్నికముఁ దీర్పఁగఁగాఫి యుపమ లు
          పాహారములు గల్గునట్లమర్చి
అభిమత సుపదార్దహారిభోజనముగా
          నర్హతాంబూలంబు లందఁజేసి
అపరాహ్ణవేళలయందు గోధూమ మా
          షాదిభక్ష్యాహార మమరఁగూర్చి
వివిధపురీసభా వృత్తాంతముల మదీ
          యముల నాకర్ణించి హర్షమంది
విశ్వకద్రు శ్యేన విషధర శార్దూల
          శిఖ్యురభ్రముల వీక్షింపఁజేసి