200
సత్కరుణావిశేషమున సౌఖ్యపరంపర నందుచుండె, సం
పత్కమలేక్షణాహృదయపద్మనభోమణి! నాగరాణ్మణీ!
గౌరవంబును, శ్రద్ధ కాన్పించు మామకా
హ్వానంబుఁ ద్రోయుదురా? యటంచు
మనకన్నముఖ్యులౌ, మాన్యాత్ము లెవరెందు
నేని పిల్చినఁజనిరేమొ? యంచు
నెవరెట్లు పిల్చిన, నేసమాధానోక్తి
నో తెల్ఫియిటకురాకుండ రనుచు
రాఁదీజుకున్నచో రానికారణమేని
వ్రాయకుపేక్షింతురా? యటంచు
నస్మదాలోకన కుతూహలాత్మకులగు
వారికిందెల్పి యిదెవచ్చు వారటంచుఁ
బలుకుచుండుట నేలూరు పట్టణమున
విని ప్రమోదించినారమో జనవరేణ్య!
దాసుమాధవ బుధోత్తంసుని భ్రాత, యా
ర్యహితుండు గోవిందరాయ సుకృతి
ధూమయానము డిగ్గి, యేము హేలాపురి
కేతేరఁ బ్రియహర్ష దృష్టిఁగాంచి
అస్మత్సుఖోదంతమరసి, క్షేమముఁదెల్పి,
స్వీయసద్మమున వసింపఁజేసి
మధురభోజనమున మాన్యతాంబూల స
త్కారాదికమున, మోదము ఘటించి
సరస కొండూరి, భామార్యవరుఁడు కామ
వరపుఁగోటకుఁ బిల్వ, భావమును మెచ్చి