పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
174

వ్రాతం బుత్తమరాజరూపపటముల్ రాజిల్లుటం బ్రాజ్ఞ సం
జాతంబొప్పుట నాగభూవరసభాసౌధంబు వంద్యంబగున్

33. కవులు, పండితులు

కవులుంబండితులంబుదాంబుధులనంగా నిత్యమన్యోన్యవృ
ద్ధివిధుల్ సల్పుచునుందురా, సుకవులెంతేఁగావ్యముల్ గూర్పఁద
త్సువిశేషంబులు దెల్పి పండితవరుల్ శ్రాతృప్రతానంబు న
ర్హవిధానంబులుదీర్పఁజేయుదురు ధీరా! భానుమూర్త్యాహ్వయా!

34. భరతమాత

భాసురసుమపత్ర, ఫల, లతా, వృక్ష, సుం
          దరతరారామబృందములుగల్గి
ముక్కారుపంటలు, మిక్కిలిపండించు
          జీవ నదీనద శ్రేణిగల్గి
అమితభాగ్యోన్నతు లమరించుమణి, హేమ
          రజతాదిలోహకరములుగల్గి
నిఖిలమహాయంత్ర నిర్మాణ శాస్త్రాప
          దేశదివ్యగ్రంధ రాశిగల్గి

వీరజననీ, సతీ, పుత్త్రవితతిగల్గి
పొలుపుమీఱు భవత్పుణ్యభూమి, యీతి
బాధలొందకయుండఁ బ్రోవంగదమ్మ
భద్రకరుణాగుణోపేత! భరతమాత!

35. శ్రీరాజాగారి తండ్రిగారును, గీర్తిశేషులును, నైన శ్రీరాజా బొమ్మదేవర నరసింహనాయఁడు బహద్దరు జమీందారువారి ఛాయాపటము

పొదనుండి కవియుబెబ్బులి నెదుర్కొని భాహు
            విక్రమంబునఁగూల్చు వీరుఁడంచు