పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111



శతఘంట కవనంబు సల్పఁబూనెదరేని యద్దాని మించి చేయంగలేమొ
నేత్రావధానంబు నేర్పు జూపెదరేని యద్దాని మించి చేయంగలేమొ

ఆంధ్రమున నిన్ని యన్ని పద్యములటన్న
నింతకాలంబులోనన్న, నిందఱన్న
నిట్టి వర్ణోత్కరంబన్న, నేమి వెఱపు
తెలుఁగు మీసంబు నిలుపంగఁ దివురుఁడింక.

చెప్పిన వన్ని చేసెదము, చింత యొకింతయు లేదు వెంటనే
చెప్పుఁడి యుత్తరంబు, సభచేయుటొ చేయక మారు వ్రాయుటో
తప్పక వ్రాయఁగావలసె, ధర్మమె గెల్చునఁటంచు నమ్మి నా
తప్పొకయింత లేమి, యిది ధార్మికులందఱెఱింగి యుండుటన్.

గుంటూరు,

20-8-1911

ఇట్లు,

కొప్పరపు వేంకటసుబ్బరాయశర్మ, శతావధాని.

ఇట్లు ప్రతిజ్ఞా పద్యములంజెప్పిన వీరిశక్తినిఁబ్రత్యక్షముగాఁజూడఁగోరిన మా చీరాల పేరాల పురవాసులకు నీ సోదర కవిచక్రవర్తులు పరమానందంబును గూర్చిరి.

అట్టి అవధానిపంచాననులను; మరల మంగళవాద్యములను, ఆవిరి దీపములను, మహానందంబు సంఘటింప నూరేగించిరి. ఆ సమయమునఁ బౌరులందఱును గర్పూర నీరాజనాదుల సమర్పించి పవిత్రులైరి. ఇట్లు మమ్మందఱ నమందానంద భరితులఁజేసిన శ్రీ బాలసరస్వతులకు భగవంతుఁడు దీర్ఘాయుర్భాగ్యంబు లొసంగుఁగాత!

ఇట్లు,

ఉలిచి పిచ్చయ్య

మునిపల్లి వెంకటసుబ్బయ్యశర్మ