పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
94

శ్రీమాన్ తిరుమల శేషాచార్యులు, వేంకట రమణాచార్యులు గార్లు

చరికొండధర్ముఁడన్ సత్కవిచంద్రుఁడు
         నవకంపు మొక్కను నాటినాఁడు
భట్టుమూర్తియనెడి పండితమాన్యుండు
         పొలుపొందఁగా నీరుపోసినాఁడు
అటమాడభూషి వేంకటసత్క వీంద్రుండు
         పెంపొందఁగా నల్లుపెట్టినాఁడు
తిరుపతి వేంకటేశ్వరుల నశ్వరముగా
         సదమలకృపతోడ సాఁకినార

లట్టిదగు నీశతవధానమనెడి లతిక
సరసకొప్పరపుం గవీశ్వరులచేతఁ
బుషితమై విరులందగెఁ దత్పుల్లసుమము
లఖిల వేదులుఁదాల్చెద రౌఁదలలను

మునుశతఘంటసత్కవులమూల్యవచోధను లాంధ్రమండలిన్
గనఁగనొకండొకండయినఁ గన్పడఁడందురు నేఁడుపల్లెటూ
రున మఱిపట్టణంబులను రూఢిగ మేల్గని రాంధ్రభూమితా
గనుఁగొనునోముపంట లనఁగాఁదగదే పరికింపవీరలన్

అమలలతాంత సంగ్రథితమైతగు దారముమేటి వాసనల్
గొమరలరారఁ గాంచుగతిఁ గొప్పరమన్ పురి గొప్పగాంచెనాం
ధ్రమహి తదీయకీర్తిలత తద్దయు నల్లెనటంచునేరికీ
క్రమమునెఱుంగఁ జెప్పవలెఁ గాంచియెఱుంగరె ధీరసత్తముల్

ఒనరఁగమిన్నుముట్టుగతి యోజనఁ జేసియు వ్యర్ధవాక్కులన్
జొనుపక శ్లేషఁగూర్చి మృదుసూక్తులఁ గైతరచించుపూర్వపుం