పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

జుంటితేనియతేట జొటజొటబొబ్బిల్లు
        సొబగుగా రసముల సొంపునింపి
చిత్తంబుమోదంబుఁ జెంద సద్భావంబు
        లందందు నందంబు చెందఁజొనిపి
మలయానిలప్రభా విలసనంబునఁజొక్కు
        సరణిని సౌఖ్యంబుఁగురియఁ జేసి

యర్ధగాంభీర్య పదశుద్ధు లంతకంత
కతిశయాహ్లాదగరిమల నందఁజేయ
నాశుధారనుఁగాని యత్యంతకష్ట
మైన యవధానములంగాని యధికులెన్ను
కవితఁగాంచిరి సోదరకవులు నిజము
ఆర్యమణులార! సత్కవివర్యులార!!

అరుగు నొక్కొకమాఱు నరుధనుర్జ్యా నినా
          దముతోడ నెదిరి పంతంబులాడఁ
జెలఁగునొక్కొకపరి శ్రీకృష్ణు పిల్లన
          గ్రోవిరావంబుతో గుంజులాడఁ
బరుగిడునొకపరి పంకజాసనురాణి
          మంజీర రవముతో మాటలాడ
నేగునొక్కొకసారి హిమశైలనిస్సర
          ద్గాంగభంగాళితోఁ గలసియాడ

దేశ దేశంబులెల్లను దిరిగితిరిగి
మేటియవధాన సభలఁ దాటోటుగనక
పండితకవీంద్ర గౌరవప్రాభవముల
నందియుండెను వీరి మహాశుధార