పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89


అవధానాంతమున

పండితకవుల యభిప్రాయములు

బ్రహ్మశ్రీ శతావధాని జూపూడి హనుమచ్ఛాస్త్రిగారు

(బెల్లంకొండ రామరాయ విద్వత్కవీంద్రుల శిష్యులు)

శతలేఖిన్యవధాన తంత్రమన దుస్సాధ్యంబు సూ, పైని వ
స్తు తతుల్ గోరిరి చెప్పరాని వవి సంతోషంబుగాఁ బూర్తి చే
సితి వింకేమి కొఱంతలేదు, కవితా సింహాసనస్థాన సం
స్థితిఁ గల్యాణ పరంపరాతి గరిమల్ చేకొంటివో సత్కవీ!

దయగల వాఁడు జీవన ముదారతనిచ్చెడు వాఁడు శుద్ధచి
న్మయుఁడు గుణాఢ్యుఁడాద్యుఁడు సుమాస్త్రునితండ్రి రమావినోది య
ద్వయుఁడల రామమూర్తి కవితారమణీయుల మిమ్ముమమ్మునున్
దయదయివాఱఁబ్రోచుత విధాతయు నాయువొంసగుఁ గావుతన్

బ్రహ్మశ్రీ వులిగుండం రంగరావుపంతులుగారు బి.ఏ. గుంటూరు జిల్లా కోర్టు ప్లీడరు

పెరిమెన్ బొల్చును నీకవిత్వము మహావిద్వాంసులున్ ధీరులున్
గరిమన్ మెచ్చఁగఁజెప్పినాఁడవిఁక నీకావ్యంబు లెట్లుండునో
వెఱఁగౌ నీయవధానపుం గతులనే వేనోళ్ళ గీర్తింపఁగాఁ
బరఁగెన్ భేషన సుబ్బరాయకవి సంభావింపరాదే? నినున్