పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

జరుగు శతఘంట కవనంపు సభయటంచుఁ
బిలిచి నంతటనే విశదలకు వారి
నర్హ వాక్యంబులను మధురాన్నములను
హాయిగొనఁజేసి తిరుపతిరాయఁ డలరె

విశదల శ్రీ మల్లీశ్వరస్వామి

ఒయ్యనఁ బుట్ట కోటపయి నుండిన శ్రీ రమణీశుబొల్లి మో
రయ్యనుగాంచి, యా హరిదయామతి నాత్మకుఁదోఁచిశూలినా
నెయ్యుఁడు నాకు నాతనికి నిక్కము భేదములేదు కాన నీ
వెయ్యెడనైన దేవళము నీశునకుం దగఁ గట్టి యాతనిన్
జయ్యనఁగొల్వు మిష్టములు సాగును దిర్పతి! యంచుఁబల్కనా
యయ్యకు మ్రొక్కి విస్తలపురావనిఁ జిత్ర విచిత్ర వైఖరిన్
డయ్యన నొక్కకోవెల దృఢంబుగఁ గట్టి కుమారదేవుఁ గ
న్నయ్యను మల్లికేశు నిను నాభ్రమరాంబను విశ్వమాతఁదా
నియ్యెడనిల్పి కొల్చె నతఁ డితఁడె తిరృతి ప్రోవు మీశ్వరా

శరడిండీరపటీరశుభ్ర సరసీజాతాచ్ఛపత్రాదితే
యరసారుట్ శరదబ్దహీరదర పంచాస్యారవాణీపయ
శ్శరధీరాభ్ర తరంగిణీలహరికాసంక్రందనాశ్వక్షపా
కరనీకాశకనత్స్వరూప! త్రిజగత్కళ్యాణ! మల్లీశ్వరా!

సరసీజాసన శక్రముఖ్యదివిషత్సంఘో త్తమాంగస్థభా
స్వరరత్నస్థగితోరు భూరిమకుటీ శస్తద్యుతిచ్ఛన్న సుం
దరవాతాశన రాజ మండన లసత్పాదారవిందా! బుధా
దర చారిత్ర! దినేశసోమశుచినేత్రా! భర్గ! మల్లీశ్వరా!