పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65


అగ్రాసనాథిపతిగారిని గుఱించి

అవధానంబొనరించు నీసభకుఁ దానగ్రాసనాధీశ్వర
త్వ విలాసంబు భరించినాఁడు కవితా తత్త్వంబు వీక్షించినాఁ
డవురా తిర్పతియున్ సభాసదులుఁ దన్నౌనంచు మన్నింప వే
డ్కవరంబై తగ న్యాయవాదియగు కొండా వెంకటప్పార్యుఁడే.

మరియు సభచేయించినవారిని గుటించి

వేంకట రాయనాముఁడు ప్రవీణుఁడు సోదరుఁడై రహింప ని
శ్శంక గుణాభిరాములగు సౌమ్యులు పేరయ వీరయాహ్వయుల్
కొంకు గలంకు లేక తనకున్ బరిచర్యలు సేయుచుండ నే
వంక గొఱంత లేని సిరి వర్ధిలఁ దిర్పతి యొప్పుఁగావుతన్.

శ్రీ చెరుకూరు తిరుపతిరాయఁడుగారి వృత్తాంతము

మానితంబైన గుంటూరు మండలమునఁ
దనరె సిరి కాఁపురంబు విస్తలపురంబు
పుణ్యపురుషులకది జన్మభూమి యందుఁ
గలరు చెరుకూరివారన కమ్మవారు

చెరుకూరు వంశాబ్ది శీతాంశుఁ డురుకీర్తి
         భరుఁడు పేరయ్య యెవ్వానితండ్రి
భాగ్యదేవతకుఁదాఁ బ్రతివచ్చు భాగమాం
         బా శిరోరత్న మెవ్వానితల్లి
శంకాపహారి శ్రీ వేంకటరాయాభి
         ధానుండు సుగుణి యెవ్వాని తమ్ముఁ
డతిసుందరాకారుఁడైన వీరయ్య యె
         వ్వని సోదరుని ప్రియతనయుఁడయ్యె