ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రథమ భాగము
"క. మాయమ్మానను నీవే,
రాయలవై కావదేవ రాజే జే జే
మాయూతుమ లానినయది
పాయక సంతోషమున్న పలమిలసామీ. ” (కళా. అ. 6, ప. 161)
ప్రథమాగమా దు లు మదాశయుని పురోహితాదుల నోడించు టకై సంస్కృతాంధ్ భాషా శ్లేషములతో నీ పద్యమును బల్కి వారిని వెగడువఱిచి రాజు నకుం దమ్ముం దెలిపి క నిరి. ఈ సందర్భము కాళిదాసుని చరిత్రచే సూచితంబు. చిత్రకవిత్వమైన నేమి ? కథా వృత్తముతో ననుసంధించినదియు ప్రధానమును గావున నిది సమంజసమే. ఇంతటC గవి విరమించి యుండిన నెంతో బాగుగ నుండె. ఇంక ను నీలాటి పద్యము వినవలయునని కళాపూర్ణుండు కుతూహలుఁడయి వీరి నడి గి నట్లు ను, ఆ రా జు యే క్క వినోదార్థముగా
“క. తా వినువారికి సరవిగ,
భావనతో నాను నతివిభావిసు తేజా
దేవర గౌరవ మహిమన,
మావలసినకవిత మరిగి మాకు నధీశా. " (కళా. ఆ. 6, ప. 172)
అను పద్యము ప్రథమాగముండు నివేదించినట్లును వ్రాసియు న్నాఁడు. ఈ రెండవకల్పన పనిలేని పాండిత్య ప్రకటనమేగాని, యప్పటి వృత్తాంతముంబట్టి సహజముగ నేర్పడిన సరసము గాదు. మఱికంధరుని తీర్థయా త్రాభివర్ణనములో నతఁడు సేవించిన క్షేత్ర ముల కనేక ములకుఁ గవి యంత్యప్రాస నియమమాపాదించి యుండు ట బమ్మెర పోతన విలాస ప్రభావమేమో !
“మ. యమునం జూచెను వీచి కాచయమునం బ్రాంచద్ఘన శ్యామతో యమునన్ సారసకై రవోచ్చయమునన్ ... ..." ఇత్యాది
(కళా. అ. 2, ప. 111) మఱియు రగడలేనిది రాగము గుదురదని కాఁబోలు శ్రీరామ స్తోత్రము నొకటి వ్రాసి మణికంధరుని జిహ్వకు నంటించినాఁడు. ఇట్లనేకరీతుల శబ్దచిత్రము సంఘటించి యున్నాఁడు గాని, యిది కావ్యమునకు వన్నె(దెచ్చు పద్ధతియనుట గడు సాహ సము. ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనము ప్రభావతీ ప్రద్యుమ్నమునం దిట్టి విఱుపు ల పురూపములు.