రెండవ ప్రకరణము
పింగళి సూరనార్యుఁడు మధ్యకవులకుఁ జేరినవాఁడు గావున ప్రాచీన గ్రంథములను ముఖ్యముగా భారతమును బహుశ్రద్ధతోను భక్తితోను బఠించియుండును. ఇందుల కమ్మహేతిహాసములోని గుంభనల జ్ఞప్తికిఁ దే (జాలినంత సాదృశ్యముగల రచనలC ごやCä3 యుంట యొక సాక్ష్యము. చూడుఁడు. కర్ణుఁడు తన యన్నయాట యో బ్రీంగిన పిదప ధర్మరాజు చింతించిన విధంబు : “ఆ. అతని మేను గుంతి యట్టులకైవడి యరయ నేను జూచి యాత్మ నెద్ది కారణంబొ యిట్లుగా ననుచుండుదు నేమి సేయువాఁడ నింకఁ జెప్పమ !?? (శాంతి. 1 ఆ.) ఈ రీతినే సుము ఇూసత్తియు మణిస్తంభు ( డు దన భర్తయని యెరుంగని దగుటంజేసి యతని నే మే మో పల్కి, పిమ్మట నతడు ప్రచ్ఛన్నశాలీనుఁడని యెఱిఁగినదై యతని నుద్దేశించి యూడిన ప్రకారము : సీ. ఇందాఁక నెఱుఁగ నేనేమి యంటినో మిమ్ము ననుచుఁ గన్నీళ్ళు రా నడఁచికొనుచు, సడపులమాటల నగవుల మీ యందుఁ దొంటికైవడి గొంత దోఁచుచున్న, వసుధమానిసిఁబోలు మానుసులులేరె యనుచునుండుదు * 4 (కళా. ఆ. 4. ప. 165) మఱియు C గణ్వాశ్రమ వర్ణనావసరమున నాదిపర్వములో : “సీ. శ్రవణసుఖంబుగా సామగానంబులు నదివెడు శుకముల చదువుదగిలి కదలక వినుచుండు కరులును, గరికరశీతలచ్ఛాయఁదచ్ఛీకరాంబు కణముల చల్లని గాడ్పానపడివానిఁ జెందిసుఖంబున్న సింహములును భూసురప్రవరులు భూతబలుల్జెచ్చిపెట్టు నీవారన్న పిండతతులు. ఆ. గడఁగి భక్షింప నొక్కటఁ గలసియూడు చున్న యెలుకలుఁ బిల్లులునొండు సహజ వైరివర్గంబులయు సహవానమపుడు సూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది”