పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాల]

ద్రౌపదీ సందేశము

49


తెలుపుము సంజయా, విరటుధేనువులం బరిముట్టువేళ ను
జ్జ్వలభుజవిక్రముల్ కురుసృపాలవరుల్ చవిగొన్న పార్థుతూ
పుల దొనలింక రిత్తవడిపోవవు; గాండివి చిత్తమట్ల వై
రుల రుధిరంబుఁజూఱగొన రోషముఁ గ్రక్కుశరంబులేనియున్.

రాజ్య మేనాఁటికిని వీరభోజ్యమనుచు
జనులు పల్కెడిమాట నిశ్చయము సుమ్ము,
పరమసుఖములఁ దులదూఁగు నరవరుండు
పిలిచిరాజ్యంబులిచ్చునే భిక్షుకులకు?

బొల్లి మొగాలపైఁ జెమటబొట్టులు గ్రమ్మ నురక్షతంబులన్
బెల్లుగ నెత్తురోడికలు పేర్చఁగ మిమ్ము పృధాసుతుఁడు వి
ద్యుల్లతికాభ బాణములఁ దూల నదల్చి వధించుదాఁక మీ
యుల్లము రాజ్యభాగమున కొప్పునొయొప్పదొ సూతనందనా.

వైరి విభీషణాకృతిని వాయుసుతుండు గదన్ ధరించి దు
ర్వార మదేభ మబ్దవనిపైఁ బడురీతిఁ గురూర్వినాధులం
బేరు దలంపరానియటు పీనుఁగుపెంటలు సేయునప్పుడై
నా రవయేని నెంతురె మనంబునఁ బాండుతనూజుశౌర్యమున్ ?