Jump to content

పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాల]

కవితాప్రణయిని

45


'ప్రత్యుషస్సుల నూత్నపత్రములు విచ్చి
విమల హిమబిందువులు రాల్చు సుమ వితతుల
తోడఁ బ్రమదాశ్రువులు వీడి పాడుచుందుఁ
గలికి, నీమనం బంటెడు గానములను.

‘సందెమబ్బుల చిఱువేరు చాయదీసి
పండువెన్నెల పసరునఁ బదనుచేసి
తరుణి, నీపట్టు ముసుఁగు నద్దకమువైవ
విఫల యత్నంబులం జల్పి వెఱ్ఱినైతి.

'పారిజాతపుష్పంబులు పవనహతిని
మృదులతృణముల రాలెడునెడల, నీదు
చరణవిన్యాస కోమల శబ్దమనుచు
నడుగుగుర్తులఁ బలుమాఱు నరయుచుందు.

'సాలెగూళుల ముత్తెంపు సరములటుల
లేఁతగాలికి నల్లఁ జలించు మంచు
నీటిబొట్ల మాలనుగట్టి నీదుమెడను
వైవఁ దలపోసి యెగతాళిపడితి చెలియ.