పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృశతకము

313

ఆలీసాందరువంటి శూరుని రణవ్యాపారముల్ మాన్పి సై
న్యాళిం బీఁనుగు పెంటలంజలిపి కయ్యంబందుఁ బ్రాచ్యావనీ
పాలుర్గండర మిండలంచుఁ దలవంపన్ గ్రీకుసర్దార్లు దో..
ర్లీలం జూపిన చంద్రగుప్తు మదిఁ బేర్మింగాంచవే. మాతరో.

ఢిల్లీ రాజ్యధురంధరుంగదిసి దుండిన్ బోర జృంభించి శుం
భల్లీలన్ జయలక్ష్మిఁగైకొని రిపువ్రాతంబులంజీల్చి పే
రుల్లాసంబున రాజపుత్ర యశముద్యోతింపఁ జిత్తోడ్ క్షమా
వాల్లభ్యంబు భరించె; నట్టిపురిశోభల్ మాసెనే మాతరో.

ఆర్యావర్తమనార్య సంఘపద విన్యాసోగ్రపాపంబునన్
శౌర్యౌదార్యపవిత్రవేదవిధులం బాసెంగటా! లెండు మీ
ధైర్యస్ఫూర్తి యొకింతచూపుఁడనిపోత్సాహంబుఁగొల్పెన్ యశో
ధుర్యుండా మహరాట బెబ్బులి మదిందో తెంచునే మాతరో.

ఔగా! గౌతమి తీరముల్ యవనపాలానీకినీ స్పర్శచేఁ
గూరెం గల్మష, మాంధ్రదేశయశ మెగ్గుంబొందె, నేమున్నదిం
కోరాయా, యని పౌరులాడఁ బరరాడ్యూధంబులన్ గెల్చిపొ
ట్నూరన్ నిల్పడెకృష్ణరాయఁడుజయాంకోత్తంసమున్ మాతరో.

పరరాణ్మత్తగజేంద్ర కుంభదళన ప్రారంభనిర్యాత భా
స్వరముక్తాఫలహారముల్ నిజయశః సాధ్వీగళాలంక్రియ
స్ఫురణన్ మీఱఁగనాంధ్రశౌర్యముఁబరాసుల్ మెచ్చఁబోరాడె
భూ! వరుఁడాబొబ్బిలి బెబ్బులింగనుమ పాపారాయనిన్ మాతరో