పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

కవికోకిల గ్రంథావళి

గురుశాపంబును విప్రశాపమిపుడే గూడెంగదా, యస్త్రముల్
పరునిం దాఁకవటంచు నర్జున శరవ్రాతక్షతిన్ రొమ్ము నె
త్తురుఁబైఁజిమఁగ, నేలఁగ్రుంగు రథమున్ దోర్దండముల్ మోపియే
డ్తెఱఁ బైకెత్తెడి కర్ణయోధ రణశక్తిం బాడుమీ మాతరో.

సెలవుల్ సాంధ్యరమన్ వహింపఁగఁ గురుక్షేత్రంబునన్ ధార్తరా
ష్ట్రుల కీలాలము దోయిలించి దగగొట్టుల్ దీఱఁగాఁద్రావి,తూఁ
పులగంటుల్ విరఁబూయు కింశుక కుజంబున్ గ్రేణిసేయన్ జగం
బులు భీతిల్లగ ద్రౌపదిం దరియు భీముం గాంచుమో మాతరో.

గురువృద్ధాంచిత సైన్యముంగనుచు నీగోడేల నాకంచు సం
గర వైముఖ్యముఁజూపు పార్థునకు వీకన్ గీత బోధించి ని
ర్భర శౌర్యంబును గొల్పి తేరికిని సారథ్యంబుఁగావించి భూ
భరమున్ డించిన సూత్రధారిని మదిన్ భావింపవే మాతరో.

కంసోర్వీశుఁడు క్రూరుఁడై నిజభుజూగర్వంబునన్ లోకమున్
హింసింపన్ గతియేమిలేక పనులెంతేఁ గుయ్యొ మొఱ్ఱోయనన్
శంసాపాత్రుఁడు కృష్ణుఁడా నృపతి మస్తంబూడ్చె; నవ్విక్రమో
త్తంసున్ దుష్టనికృంతనున్ నిరతమున్ ధ్యానింపవే మాతరో:

శరదిందూదయవేళ యామునతటిన్ సంగీతనాదంబు లం
బురహాంతస్థమిళింద ఝంకృతులలోఁ బూర్ణత్వముంబొంది యిం
పు రహింపన్ మురళీరవాంచిత సుధాపూరంబు వాఱించి యే
పరమాత్ముండిల మేలుకొల్పె, నతనిం బ్రార్థింపుమా మాతరో