310
కవికోకిల గ్రంథావళి
తలఁపం జిత్రముగాదె బౌదుల నలందావిశ్వవిద్యాలయ
స్థలమున్ ముప్పదివేల శిష్యులట శాస్త్రంబుల్ పఠింపంగ ని
చ్చలు వాణీనిలయంబులై వెలయు నాస్థానంబు లేమయ్యెనో?
కలఁ జింతించిన యట్టులాయెఁగదె యిక్కాలంబునన్ మాతరో.
జలకంబాడి త్రయీప్రయుక్తవిధులన్ సాంగంబుగందీర్చి వి
ద్యల నభ్యాసము సల్పఁదాపసుల చైత్యంబుల్ సమీపించు శి
ష్యులు లేమింగద భావదాస్యపరతన్ శుష్కించుచుం గ్రుంగె దే
బలవత్కాలజలప్రవాహ భయదావర్తావళిన్ మాతరో.
సుతులత్యంత భుజబలాడ్యులగుచున్ శూరత్వమేపార వి
శ్రుతనంగ్రామకళాధురంధరత శత్రువ్రాతముం ద్రుంచి సం
తత కీర్తిన్ వెలయింప నీనయన పద్మంబుల్ ప్రమోదాశ్రుశో
భితిముల్ గావొకొ మున్ను; నేఁడవియెటుల్ పెంపేదెనే మాతరో.
అవనిన్ వాఙ్మయమందు క్షత్రియపద వ్యాప్తిందొలంగింప భా
ర్గవరాముండు ప్రతిజ్ఞపట్టి తరుణక్ష్మాపాల కంఠాంకు రా
స్రవదస్రోత్కట నిర్ఝరిం బరశు మత్స్యం బీఁదనేర్పించి సం
స్తవనీయుండయి మించె నట్టిసుతు నెంచన్ లేవటే మాతరో.
ఖరరక్షో ముఖులైన నాల్గుఁబదివేల్ క్రవ్యాదులన్ ధైర్య సు
స్థిరతన్ దా నసహాయశూరుఁడయి నిశ్శేషంబుగంగూల్చి, రా
గ రమం గ్రక్కు నశోకశాఖవలె రక్తప్లావితాంగంబుతో
ధరణీజాతకు డాయు దాశరథి సందర్శింపవే మాతరో.